కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. అలాగే క్రూడ్ సోయా ఆయిల్ ధరను టన్నుకు 1452 డాలర్ల నుంచి 1415 డాలర్లకు తగ్గించేసింది.
ఆర్బీడీ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1245 డాలర్ల నుంచి 1148 డాలర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వంట నూనె ధరలు మరింత తగ్గొచ్చు. భారతదేశంలోని వంట నూనెల డిమాండ్లో 56 శాతం దిగుమతులే ఉన్నాయి. అంటే అంతర్జాతీయంగా పెరిగే ధరలు, మన దేశంలోని వంట నూనెలపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఇటీవల బాగా పెరిగాయి. వివిధ దేశాల డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్లలో వంట నూనెల ధరలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
ముంబై మార్కెట్ ప్రకారం మే 7న పామాయిల్ ధర కేజీకి రూ.142గా ఉంటే ఇప్పుడు రూ.115కు తగ్గింది. అదే విధంగా సన్ఫ్లవర్ ఆయిల్ ధర కూడా తగ్గింది. మే 5న ధర కేజీకి రూ.188 గా ఉంటే.. ఇప్పుడు ఈ రేటు రూ.157 తగ్గింది. అలాగే వేరు శనగ నూనె ధర రూ.190 నుంచి రూ.174కు దిగొచ్చింది.