ఏపీ నూతన మంత్రివర్గ విస్తరణ YSRCP లో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. చాలా మంది తమకు మంత్రి పదవి దక్కకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వీరిని బుజ్జగించే పనిలో ఉంది. తాజాగా ఈ జాబితాలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరారు. అధిష్టానం తనను దెబ్బకొట్టిందని.. అవకాశం వచ్చినప్పుడు తాను అధిష్టానాన్ని దెబ్బ కొడతానని అనకాపల్లి జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తేల్చి చెప్పారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: పదవి రాలేదని వైసీపీ నేత దారుణ నిర్ణయం.. రైలు కింద పడి!
కోటవురట్ల మండలంలో సోమవారం వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ విలేకరి.. కొన్ని రోజుల క్రితం గొల్ల బాబారావు అమరావతిలో చేసిన హింసావాది వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. ఆయన తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. ‘‘ఈ బోడి రాజకీయాలు నాకెందుకు. ఒక మాట కోసం వాళ్లతో వెళ్లాను. వైఎస్సార్ చనిపోయినా సరే.. వైసీపీలో జాయిన్ అయ్యాను. పార్టీ కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. అయితే నన్ను అమాయకుడిగా భావించి నేడు మంత్రి పదవి ఇవ్వలేదు. నేను అమాయకుడిని కాదె.. అవకాశం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తాను’’ అన్నారు. మంత్రి పదవి రాకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తాను కూడా దెబ్బ కొట్టి చూపిస్తానని బాబురావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ప్రమాణ స్వీకారానికి కాకాణి నన్ను పిలవలేదు: అనిల్ కుమార్ యాదవ్అంతేకాకుండా.. ‘‘అధిష్టానం నన్ను అమాయకుడిగా భావించి.. పదవి ఇవ్వకుండా చేసింది. నాపై ఆశలు పెట్టకున్న లక్షలాది మందికి నేనేం జెప్పాలి. నన్ను అమాయకుడిని అనుకుంటున్నారేమో.. నేను హింసావాదిని. ఇలా చెప్పడానికి నాకు ఏం భయం లేదు. ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. నాకు జరిగిన అన్యాయం గురించి సజ్జల రామాకృష్ణారెడ్డికి తెలిపాను. ఇక్కడ నుంచి 70 కార్లలో 250 మంది నాయకులతో వెళ్లి సజ్జలను కలిశాను. ఆయనేం స్పందించలేదు. అలాంటప్పుడు మేమేం చేస్తాం. వాళ్లు నన్ను దెబ్బ కొట్టారు. నేనూ దెబ్బ కొట్టి చూపిస్తాను’’ అంటూ హెచ్చరించారు. బాబురావు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మాజీ మంత్రి కొడాలి నానికి ఏమైంది.. గోశాలలో పడుకోవడం ఏంటి!