సినిమా అంటే కోట్లలో జరిగే ఒక వ్యాపారం. ఇక్కడ మేకర్స్ నాయకులతో ఎంత బాగుంటే.. బిజినెస్ అంత బాగుంటది. కానీ.., ఏపీలో మాత్రం ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అధికార పార్టీని లెక్కచేయడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో సినిమాని, రాజకీయాలను వేరు వేరుగా చూడలేము. నందమూరి తారక రామారావు సినీ నటుడిగా ఒక వెలుగు వెలిగి, ఆ తరువాత రాజకీయాల్లోనూ తెలుగు వారి సత్తా చాటి చెప్పారు. ఆ సమయంలో ఇండస్ట్రీ అంతా ఆయన వెంటే నడిచింది. ఇక తారక రామారావు వేగాన్ని అదుపు చేయడానికి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణ వంటి డైనమిక్ హీరోని తమ అస్త్రంగా మార్చుకుంది. అలా తెలియకుండానే ఇండస్ట్రీకి రాజకీయాలతో సంబంధం ఏర్పడి పోయింది. కాకపోతే.. అధికారంలో ఎవరున్నా.. సినీ ఇండస్ట్రీకి అగ్ర తాంబులం ఇస్తూ వచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు ఇండస్ట్రీ అంతా కూడా నాయకులతో బాగానే ఉంటూ వచ్చారు. కానీ.., ఏపీలో ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యారో అప్పటి నుంచి లెక్కలు మారిపోయాయి.
సినీ హీరోలు కానీ, నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, సినీ పెద్దలు కానీ.. ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపింది లేదు. అలా అని.. సీఎం జగన్ కూడా మౌనంగా కూర్చోలేదు. టికెట్ ధరలు అనే తేనే తొట్టిని కదిపి ఇండస్ట్రీ అంతా తన వద్దకు క్యూ కట్టేలా చేశారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేల అధికార పార్టీని ఢీ కొట్టడానికి కూడా మేకర్స్ భయపడటం లేదు. ఇండస్ట్రీ పెద్దలుగా చెలామణి అవుతున్న కొందరు సో కాల్డ్ పెద్దలు మొదటి రోజు నుండే జగన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ వారి స్వరం అలానే ఉంది. ఇక తాజాగా విడుదలైన ఓ సినిమాలో అయితే డైరెక్ట్ గా వైసీపీ మంత్రినే టార్గెట్ చేశారు.
ఇదేంటి అని అడిగితే.. ఆ చిత్ర నిర్మాత ఏకంగా ఇంటర్వ్యూలోనే సెటైర్స్ పేల్చాడు. ఇక.. మెగా బాస్ చిరు కూడా తొలిసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. ఇక టీడీపీ భక్తులుగా ముద్రపడ్డ మురళీ మోహన్ అయితే.. జగన్ దిగిపోయే సమయం కోసం చూస్తున్నా అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. నాని లాంటి యంగ్ హీరోలు కూడా ప్రభుత్వంపై సెటైర్స్ పేల్చిన సందర్భాలు ఉన్నాయి. హైపర్ ఆది కూడా సమయం, సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపైనా, వైసీపీ నాయకుల మీద సెటైర్లు విసురుతూనే ఉన్నారు. ఇలా టీడీపీ, జనసేన మొత్తం ఇండస్ట్రీని తమవైపు తిప్పేసుకోవడంతో.. ఇక్కడ వైసీపీకి స్పేస్ లేకుండా పోయింది. దీనికి తోడు.. ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి కౌంటర్ ఎటాక్స్ తగ్గిపోవడం కూడా ఆ పార్టీకి భారీ నష్టాన్ని మిగిలిస్తున్నాయి.
అలీ, పోసాని వంటి కొంతమంది వైసీపీ మద్దతుదారులు ఇండస్ట్రీలో ఉన్నా.. వారి స్టామినా సరిపోవడం లేదు. ఓ బిగ్ స్టార్ సపోర్ట్ ఇండస్ట్రీలో ఆ పార్టీకి అవసరం. జనసేనకు పవన్, చిరు, చరణ్ అంటూ స్టార్స్ తో నిండిన ఒక టీమ్ ఉంది. టీడీపీకి కూడా బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వంటి స్టార్స్ అండ ఉంది. ఎటొచ్చి వైసీపీనే ఇక్కడ ఎవ్వరినీ ఓన్ చేసుకోలేకపోయింది. దీనికి తోడు.. ఏకంగా ప్రభుత్వంలో ఉన్న తమపైనే సెటైర్స్ పడుతున్నా స్పందించలేని స్థితికి వచ్చేసింది. రాజకీయాల్లో ఏ ఫోర్స్ వల్ల ఎన్ని ఓట్లు పడుతాయో చెప్పలేము. సినీ గ్లామర్ మాత్రం ఎంతో కొంత కలిసి వస్తుంది. మరి.. ఈ సత్యాన్ని అర్థం చేసుకుని వైసీపీ జాగ్రత్త పడకపోతే మాత్రం రానున్న కాలంలో గట్టి దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.