ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటి నుంచే పొత్తులు వ్యవహారాలు తెర మీదకు వచ్చాయి. జనసేనతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒపెన్ కామెంట్స్ చేశారు. జనసేనతో పొత్తు తమకు ఇష్టమే అనే ఉద్దేశంతో.. ఒన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదు అన్నారు. మరో వైపు అటు ఏపీలో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడం మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ సభను విఫలం చేయడానికి అన్ని విధాల ప్రయత్నించింది. కానీ ఏపీలో మాత్రం ఇందుకు వ్యతిరేక పరిస్థితులు కనిపించాయి. పీఎం మోదీని సీఎం జగన్ దగ్గరుండి ఆహ్వానించడమే కాక.. సభను విజయవంతం చేశారు. అంటే రెండు రాష్ట్రాల్లో వేర్వేరు కార్యక్రమాలు కాబట్టి ఇలా జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. ఏపీలో మోదీ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ సభకు పవన్ గైర్హాజరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్గా ఉన్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. బీజేపీ పెద్దలతోనూ పవన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. భీమవరంలో నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఈ వేడుక నిర్వహించింది. ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. కాని పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరుకాలేదు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఆప్యాయంగా పలకరించుకున్న పవన్ కళ్యాణ్- మంచు విష్ణు! ఫోటోలు వైరల్!
బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చారు. భీమవరం పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలో ఉంది. అంతేకాదు గత ఎన్నికల్లో భీమవరం నుంచి అసెంబ్లీకి పవన్ పోటీ చేశారు. భీమవరంతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి భీమవరానికి ప్రధాని మోడీ వస్తున్నా.. తనకు అధికారికంగా కేంద్ర సర్కార్ నుంచి ఆహ్వానం ఉన్నా పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడం అందరిని అశ్చర్యపరుస్తోంది. జనసేన తరపున ప్రతినిధిని మోదీ సభకు పంపించారు. ఇదే ఇప్పుడు ఏపీలో చర్చనీయంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: నాని ఫంక్షన్ లో సినిమా వేరు, రాజకీయం వేరు.. రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో మాత్రం అలా..!
ఇక ప్రధాని మోదీ భీమవరం పర్యటనకు పవన్ దూరం కావడంపై పలు రకాల వాదనలు వస్తున్నాయి. అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఇదే పవన్ రాకపోవడానికి ప్రధాన కారణమని అంటున్నారు. జగన్తో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే మోదీ టూర్కు జనసేన చీఫ్ దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో సీఎం జగన్ని టార్గెట్ చేసి.. తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు పవన్. అటు వైసీపీ కూడా చంద్రబాబు దత్తపత్రుడు అంటూ పవన్కు కౌంటరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్తో కలిసి వేదిక పంచుకుంటే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్.. ప్రధాని పర్యటనకు హాజరుకాలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: దటీజ్ పవన్.. ఫోటో వైరల్.. ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసు!