ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి. కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు మీమ్స్నే ఎంచుకున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు లేటెస్ట్గా మహేష్బాబు ఫోటోను బాగా ఉపయోగించారు.
డెనిమ్ జీన్స్, జాకెట్ వేసుకున్న మహేష్బాబు ఫోటోను షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు..’డెనిమ్ మీద డెనిమ్ ఫ్యాషన్ ట్రెండ్, మాస్క్ మీద మాస్క్ సేఫ్టీ ట్రెండ్’ అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. మహేష్ డెనిమ్ జాకెట్, డెనిమ్ జీన్స్ వేసుకొని ఉన్న మహేష్ ఫోటోతో ప్రజలకు కోవిడ్పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కనీసం అభిమాన నటీనటులతో పోలీసులు చేసే ఈ ప్రయత్నాలు ఫలించి జనాల్లో అవగాహన వస్తే బావుటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.