ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి. కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు […]