ఏపీలో ఎన్నికలకు సుమారు రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్రంలో రాయకీయ వాతావరణం చాలా వేడెక్కింది. నేతల తీరు చూస్తే.. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే.. వాటిని ఎదుర్కొనే విధంగా అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయ. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే తమ ధ్యేయం అని అధికార వైసీపీ ప్రకటించగా.. జగన్ను ఢీకొట్టడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు ప్రకటించాడు.
ఇది కూడా చదవండి: జగన్ గురించి లోతుగా తెలిసింది తనకే.. సుచరితతో సీఎం రాజీ పడాల్సిందే: వర్ల రామయ్య
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలన్ని కలిసి పోటీ చేయాలని.. వ్యతిరేక ఓటు చీలకుండ చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడటం కోసం.. అన్ని పార్టీలు కలిసి రావాలని.. అందుకు అవరసమైతే తాను ఎలాంటి త్యాగాలు చేయడానికి అయినా సిద్ధమే అని చంద్రబాబు ప్రకటించారు. అంటే.. ఇండైరెక్ట్గా తాను పొత్తులకు సిద్ధం అని ప్రకటించాడు చంద్రబాబు. ఇక టీడీపీతో మాకు పొత్తు అక్కర్లేదని బీజేపీ ప్రకటించగా.. ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తులకు తాను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇది కూడా చదవండి: టీడీపీ-ఎన్టీఆర్ ఇష్యూలోకి ఎంటరైన బాలకృష్ణ అల్లుడుపొత్తులపై చంద్రబాబు ప్రకటన చేసిన నేపథ్యంలో ఓ ప్రముఖ న్యూస్ చానెల్ డిబెట్ నిర్వహించింది. దీనిలో పాల్గొన్న వర్ల రామయ్య.. జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బోల్డ్గా, నిజాలకు దగ్గరగా మాట్లాడతాను అన్న వర్ల రామయ్య.. జగన్ వంటి పెద్ద శత్రువును కొట్టడానికి మిగతా వాళ్లంతా కలిసికట్టుగా చేరి.. బలం చేకూర్చుకుని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక జగన్ ప్రధానమైన శక్తి అని.. 150 సీట్లు సాధించాడని.. అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే.. అందరు కలిసికట్టుగా ఉండాలని వర్ల రామయ్య కోరుకున్నారు. ముందు అరాచక శక్తిని తరిమికొట్టాలి. తర్వాత మిగతావన్ని చక్కబెట్టాలి అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. వర్ల రామయ్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: AP CM jagan: నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్: CM జగన్