కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వార్త వినగానే తెలుగు ప్రజుల ఓ సారి గతాన్ని నెమరు వేసుకుంటున్నారు. వైఎస్సార్ మృతి తర్వాత ఉమ్మడి ఏపీలో చోటు చేసుకున్న సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009, సెప్టెంబర్ 2 న మృతి చెందారు. ఉమ్మడి ఏపీ ప్రజలు తమ కుటుంబ సభ్యుడే మృతి చెందినట్లుగా విలపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే టీడీపీ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందున్న నమ్మకం ఏ కోశాన లేని వేళ.. వైఎస్సార్.. మహా పాదయాత్ర చేసి.. ఏపీలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. అలాంటి మహానేత మృతి.. అందరికన్నా పార్టీకి తీవ్ర నష్టం. వైఎస్సార్ మరణ వార్త తెలిసి.. నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. స్వయంగా వైస్సార్ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చింది. నేనున్నాను అంటూ అభయమిచ్చింది. కానీ మాట నిలబెట్టుకోలేకపోయింది.
ఇది కూడా చదవండి: Sonia Gandhi And Rahul Gandhi: సోనియా, రాహుల్ గాంధీకి షాకిచ్చిన ఈడీ.. ఆ కేసులో సమన్లు జారీ!
వైఎస్ మృతి తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కానీ సోనియా దాన్ని అంగీకరించలేదు. వైఎస్సార్ మరణ వార్త తెలిసి చాలా మంది గుండెలు ఆగిపోయాయి. వారిని పరమార్శించేందుకు ఓదార్పు యాత్ర చేస్తానని జగన్ కోరితే సోనియా అంగీకరించలేదు. అంతకు ముందు వరకు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీకి చేసిన మేలును సోనియా గాంధీ మరిచిపోయిందని పలువురు విమర్శించారు. కానీ జగన్ సోనియా నిర్ణయంతో విబేధించి ఓదార్పు యాత్ర చేపట్టాడు. పైగా 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు.అప్పటి నుంచి సోనియా.. జగన్ మీద కత్తి కట్టిందనేది బహిరంగ రహస్యం. అతడిని ఇబ్బంది పెట్టేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని చేసింది. జగన్ని తన దార్లోకి తెచ్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ జగన్ ఆమె మాట వినకపోవడంతో.. దర్యాప్తు సంస్థల్ని రంగంలోకి దింపింది. ఫలితం జగతి పబ్లికేషన్స్లోకి క్విడ్ ప్రోకోగా పెట్టుబడులు వచ్చాయంటూ.. ఐటీ నోటిసుల్ని పంపింది. వీటిని ప్రస్తావిస్తూ నాటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్రావు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాశారు. క్విడ్ప్రోకో వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరగా, హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఇది కూడా చదవండి: Konaseema: జిల్లాలకు NTR, YSR పేర్లు పెడితే లేవని నోర్లు.. అంబేద్కర్ పేరు పెడితే…
జత కలిసిన చంద్రబాబు..ఇటు రాష్ట్రంలో వైఎస్ వారసుడిగా జగన్మోహన్రెడ్డి నానాటికీ బలపడుతుండటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని చంద్రబాబు అప్పటికే కాంగ్రెస్తో లాలూచీపడ్డారు. వైఎస్ జగన్ను ఇరికించడానికి.. హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసులో తమనూ పిటిషనర్లుగా చేర్చాలంటూ తమ పార్టీ నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, కె.ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు చేత ఇంప్లీడ్ పిటిషన్ వేయించారు. అలా… కుట్రలో రెండో అంకాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. తదనంతరం కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఆరోపణలపై సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల చేత సమగ్రంగా విచారణ జరిపించాలని ఉత్తర్వులిచ్చింది. ఫలితంగా జగన్ 16 నెలలు జైలులో గడిపాడు. కానీ ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరోసారి పాదయాత్ర చేసి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
కాలమెవరిని వదిలిపెట్టదు..
నాడు జగన్ని అణగదొక్కడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో.. పలువురు నేతలు.. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఆమె కావాలనే కుట్ర పూరితంగా జగన్పై అక్రమాస్తుల కేసు బనాయించిందని తెలిపారు. కట్ చేస్తే.. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడ్రెస్ లేకుండా గల్లంతయ్యింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నాడు జగన్ అక్రమాస్తుల కేసులో ప్రధానంగా వ్యవహరించిన మాజీ మంత్రి చిదంబరం కూడా ప్రస్తుతం ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి చైనీస్ పాస్పోర్ట్ కేసులో, గతంలో మరో కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: KA Paul: వైఎస్ నన్ను నాశనం చేయాలని చూశాడు. కానీ.. ఆయనే భూస్థాపితమైపోయాడు :…ఇక చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నాడు జగన్పై కేసు వేసిన తొలి వ్యక్తి శంకర్రావు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు వంటి సమాచారం ఎవరికి తెలియదు. ఎర్రన్నాయుడు దురదృష్టవశాత్తు 2012లో ఓ ప్రమాదంలో మరణించారు.
ఇక తాజాగా నాడు జగన్ని ఇరుకున పెట్టాలని తీవ్రంగా ప్రయత్నించిన సోనియా గాంధీకి.. నేడు అదే పరిస్థితి ఎదురయ్యింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ సోనియా, రాహుల్కి సమన్లు జారీ చేసింది. ఈ వార్త తెలియగానే వైఎస్సార్సీపీ నాయకులు, ఆ పార్టీ అభిమానులు.. కర్మ ఫలితం ఊరికే పోతుందా.. నాడు అన్యాయంగా జగన్ని ఇబ్బంది పెట్టారు.. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. కాలమెవ్వరిని వదిలిపెట్టదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: YSRCP Government: జగన్ మూడేళ్ల పాలన పై టైమ్స్ ఆఫ్ ఇండియా సంచలన సర్వే!