పశ్చిమ బెంగాల్లో ఒక రూపాయి డాక్టర్గా ఫేమస్ అయిన డాక్టర్ సుశోవన్ బెనర్జీ ఇవాళ కన్ను మూశారు. దాదాపు 60 ఏళ్ళ పాటు కేవలం ఒక్క రూపాయికే ఎందరో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. డాక్టర్ సుశోవన్ మరణం పట్ల దేశ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పెద్ద మనసున్న వ్యక్తిగా డా.సుశోవన్ గుర్తుండిపోతారని మోదీ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు మోదీ. ఆయనకు పద్మశ్రీ బహుకరించిన సందర్భంలో ఆయనతో ఉన్న సంఘటనలు ఇంకా గుర్తున్నాయని అన్నారు.
ఈయన డాక్టర్గానే కాకుండా పొలిటీషియన్గా కూడా పనిచేశారు. బోల్పూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1984లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్క రూపాయికే వైద్యం చేసి ఒక్క రూపాయి డాక్టర్గా ప్రాచూర్యం పొందారు. 2020లో ఈయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది అతి ఎక్కువ రోగులకి చికిత్స అందించిన డాక్టర్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. అలాంటి గొప్ప డాక్టర్ మృతి చెందడంపై పలువురు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఒక్క రూపాయి డాక్టర్పై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ডাক্তার সুশোভন বন্দ্যোপাধ্যায় সর্বশ্রেষ্ঠ মানবাত্মার প্রতীক। অসংখ্য মানুষের রোগ উপশমকারী একজন দয়ালু ও উদারহৃদয় চিকিৎসক হিসেবেই তিনি স্মরণীয় হয়ে থাকবেন । পদ্ম পুরস্কার প্রদান অনুষ্ঠানের সময় তাঁর সঙ্গে মতবিনিময়ের কথা আমার আজও মনে আছে ।তাঁর প্রয়াণে আমি ব্যথিত। pic.twitter.com/l0mf3ded8b
— Narendra Modi (@narendramodi) July 26, 2022