పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాల జైలు నుంచి శనివారం విడుదల అయ్యాడు. 10 నెలలు జైలు శిక్ష అనుభవించిన సిద్దూ జైలు నుంచి విడుదల అవుతున్నాడు అని తెలియగానే అక్కడికి అధిక సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు వచ్చారు.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాల జైలు నుంచి శనివారం విడుదల అయ్యాడు. 1988వ సంవత్సరంలో జరిగిన పార్కింగ్ గొడవలో పాటియాల నివాసి అయిన గుర్నామ్ సింగ్ ను తలపై కొట్టడంతో అతడు మరణించాడని సిద్దూ పై కేసు నమోదు అయ్యింది. దాంతో సిద్దూకు సుప్రీం కోర్టు గత ఏడాది ఒక సంవత్సరం కఠినమైన శిక్షను విధించింది. అయితే పంజాబ్ జైలు నిబంధనల ప్రకారం సిద్దూను పాటియాల జైలు నుంచి విడుదల చేశారు. 10 నెలలు జైలు శిక్ష అనుభవించిన సిద్దూ జైలు నుంచి విడుదల అవుతున్నాడు అని తెలియగానే అక్కడికి అధిక సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు వచ్చారు.
నవజ్యోత్ సింగ్ సిద్దూ.. పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 1988 సంవత్సరంలో పాటియాలకు చెందిన గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో పార్కింగ్ విషయంలో గొడవ జరగడంతో.. అతడిని తలపై బలంగా కొట్టాడు సిద్దూ. దాంతో అతడు చనిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షి ఆరోపించాడు.దాంతో ఈ కేసులో ఓ సంవత్సం జైలు శిక్షను అనుభవిస్తున్నాడు సిద్దూ. అయితే, పంజాబ్ జైలు నిబంధన ప్రకారం సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను కాస్త ముందుగానే విడుదల చేస్తారు. ఈ నిబంధనల ద్వారానే మే నెలలో విడుదల కావాల్సిన సిద్దూ.. తాజాగా శనివారం పాటియాల జైలు నుంచి విడుదల అయ్యారు.
#WATCH | Congress leader Navjot Singh Sidhu released from Patiala jail, approximately 10 months after he was sentenced to one-year jail by Supreme Court in a three decades old road rage case pic.twitter.com/kzVB2vMnpk
— ANI (@ANI) April 1, 2023