144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. క్రికెట్ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షి్ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడబోతున్నాయి. సౌథాంప్టన్లో రసవత్తర సమరం ఖాయం. రెండేళ్ల ప్రయాణం, ఎన్నో అద్భుత ఇన్నింగ్స్లు, ఎన్నో అపురూప విజయాలు, మధ్యలో కరోనా సవాళ్లు. కోహ్లీసేన ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశాన్ని వన్డేల్లోనూ, టీ20ల్లోనూ జగజ్జేతగా నిలిపిన టీమ్ ఇండియా దీర్ఘ ఫార్మాట్లోనూ కోట్ల అభిమానుల ఆశలను నెరవేర్చేందుకు బరిలోకి దిగనుంది. మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నేటి నుంచే.
అన్ని విభాగాల్లోనూ భారత్ టైటిల్ కోసం న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. ర్యాంకింగ్స్లో కివీస్ది అగ్రస్థానమైతే ఆ వెనుకే భారత్. ఇటు బ్యాటింగ్లో టు బౌలింగ్లో రెండూ రెండే. భారత్కు గెలిచేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. మరోవైపు ప్రత్యర్థి కూడా తక్కువదేమీ కాదు. కివీస్ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కెప్టెన్ విలియమ్సన్ నాయకత్వంలోని ఆ జట్టు సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది.
ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను గెలిచిన ఉత్సాహంతో పోరుకు సిద్ధమైంది. ప్రపంచ కప్లలో జట్టును విజేతగా నిలపలేకపోయిన కెప్టెన్ కోహ్లి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను దేశానికి అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. సారథిగా తనదైన దూకుడుతో సహచరుల్లో స్ఫూర్తి నింపి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టే అతడు కివీస్ సవాలును అధిగమించగలమన్న ధీమాతో పోరుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.
వాతావరణ పరిస్థితుల కారణంగా అయిదు రోజుల మ్యాచ్లో కోల్పోయిన ఆటను ఆరో రోజు నిర్వహిస్తారు. ఫలితం తేలే అవకాశం ఉందని భావిస్తేనే రిజర్వ్ డేను అమలు చేస్తారు.
World Test Championship final preview 🏆
🎙 @DineshKarthik
🎙 @Sdoull
🎙 @theanalyst
🎙 @Cricket_Mann
@lv_cricket | #InWithHeart | #WTCFinalhttps://t.co/Qd2Qkt0v9X— The Cricketer (@TheCricketerMag) June 18, 2021