టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ టెస్టులో అదరగొట్టాడు. NCA లో నిర్వహించిన యోయో టెస్టులో పాసై ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంత స్కోర్ సాధించాడో చెప్పుకొచ్చాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆటతో పాటు ఫిట్ నెస్ కి అధిక ప్రాధాన్యం ఇస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ లో, బ్యాటింగ్ చేస్తున్నపుడు వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తే విరాట్ ఫిట్ నెస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలో ఫిట్ నెస్ విషయంలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన కోహ్లీకి యోయో టెస్టు పాసవడం ఒక విషయం కాదు.. తాజాగా NCA లో నిర్వహించిన యోయో టెస్టులో కోహ్లీ పాసయ్యాడు. తాజాగా ఈ విషయాన్ని ఈ స్టార్ బ్యాటర్ మీడియా ద్వారా ప్రకటించాడు. మరి కోహ్లీ యోయో టెస్టులో ఎంత స్కోర్ చేసాడు? ఈ ఫిట్ నెస్ టెస్టులో ఎవరెవరు పాల్గొన్నారో ఇప్పుడు చూద్దాం.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో కుర్రాళ్లకు అవకాశమిచ్చి మూడు వన్డేల్లో బెంచ్ కి పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే వన్డే సిరీస్ అనంతరం ఈ టూర్ ముగించుకుని స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా యూఎస్ఏ వెళ్లి క్రికెట్ అకాడమీని ప్రారంభించి స్వదేశానికి చేరుకున్నాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత హార్ధిక్ పాండ్యా, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ అండ్ కో కూడా భారత్కి చేరుకున్నారు. ప్రస్తుతం టీమిండియాలోని కొందరి ఆటగాళ్లు నిన్న ఐర్లాండ్ సిరీస్ ముగించుకున్నారు. ఈ జట్టులో కూడా ఆసియా కప్ కి కొంతమంది ప్లేయర్లు సెలక్ట్ కాగా.. ప్రస్తుతం NCA లో ఉన్న భారత ఆటగాళ్లకు ఫిట్ నెస్ టెస్టులని నిర్వహించారు. తాజాగా ఎన్సీఏలో జరిగిన యో-యో ఫిట్నెస్ టెస్టులో పాస్ అయినట్టు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
ఇన్స్టా స్టేటస్లో కోహ్లీ యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించాడని తెలుస్తుంది. ‘భయంకరమైన శంఖాల మధ్య ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసినప్పుడు కలిగే ఆనందమే వేరుగా ఉంటుంది..’ అంటూ కాప్షన్ జోడించాడు. ఐర్లాండ్ టూర్లో మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా ప్లేయర్లు జస్ప్రిత్ బుమ్రా, సంజూ శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా నేరుగా బెంగళూరులోకి చేరుకుని, ఎన్సీఏ క్యాంపులో పాల్గొంటారు. కెఎల్ రాహుల్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని బీసీసీఐ ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ఈ నెల 30 నుంచి ఆసియా కప్ జరగనుంది. సెప్టెంబర్ 2 న భారత్- పాకిస్థాన్ తలపడతాయి. మరి కోహ్లీ యోయో టెస్టులో సాధించిన స్కోర్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.