దేశంతో పాటు ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. దాదాపు 40 రోజుల నిరీక్షణకు తెరపడింది. అపజయానికి కుంగిపోకుండా విజయమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు గత నెల జూలై 14న చంద్రయాన్ 3ని ప్రయోగించిన విషయం తెలిసిందే.
దేశంతో పాటు ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. దాదాపు 40 రోజుల నిరీక్షణకు తెరపడింది. అపజయానికి కుంగిపోకుండా విజయమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు గత నెల జూలై 14న చంద్రయాన్ 3ని ప్రయోగించిన విషయం తెలిసిందే. అన్ని దశలను విజయవంతంగా దాటుకుంటూ నేడు అద్భుతాన్ని ఆవిష్కరించింది చంద్రయాన్ ప్రయోగం. చంద్రుడి దక్షిణ దృవంపై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది విక్రమ్ ల్యాండర్. దీంతో దక్షిణ దృవంపై కాలు మోపిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ సక్సెస్ తో చంద్రుడిపై పరిశోధనలకు మార్గం సుగమమైంది. జాబిల్లిపై ఉన్న వాతావరణం, ఖనిజాలు, సౌర వ్యవస్థలో చంద్రుడి పాత్ర, మానవాళికి అనువైన వాతావరణం ఉందో లేదో అధ్యయనం చేయడానికి తోడ్పడనుంది.
ఇక చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు భారత పౌరులు పూజలు, ఉపవాసాలతో మద్దతు తెలిపారు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ గా ల్యాండ్ అయ్యేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 2019లో చంద్రయాన్ 2 ను చేపట్టిన ఇస్రో చివరి క్షణాల్లో విఫలమైంది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5:44 గంటలకు ప్రారంభమైన ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. చంద్రుడి దక్షిణ దృవంపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపింది. ఇక చంద్రయాన్ 3 సక్సెస్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Chandrayaan-3 Mission:
‘India🇮🇳,
I reached my destination
and you too!’
: Chandrayaan-3Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 23, 2023