సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ ఈ మద్య పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.
తెలుగు ఇండస్ట్రీలో నటుడు ప్రకాశ్ రాజ్ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. నటుడిగానే కాకుండా ఇటీవల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విధానాలపై పలు విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు ప్రకాశ్ రాజ్. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 3 పై చేసిన ట్విట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రకాశ్ రాజ్ పై కర్ణాటకలో కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..
ప్రకాశ్ రాజ్ జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చంద్రయాన్-3 కి సంబంధించిన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా పోలీస్ స్టేషన్ లో ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. కాగా, చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెడుతూ.. ఒక వ్యక్తి చొక్కా లుంగీ ధరించి టీ ని వడపోస్తున్నట్లు కార్టూన్ పోస్ట్ చేశారు. దీనికి ‘చంద్రుడి నుంచి వస్తున్న మొదటి చిత్రం’ అంటూ సెటైర్ గా క్యాప్షన్ పెట్టారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ – 3 అంతరిక్షంలోకి పంపితే ఒక భారతీయుడిగా గర్వించాల్సింది పోయి.. వెటకారంగా కార్టూన్ పెట్టడంపై వివాదాస్పదంగా మారింది. ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలకు చెందిన కొంతమంది నేతలు బానహట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ప్రకాశ్ రాజ్ చేసిన పనికి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కాబోతున్న విషయం తెలిసిందే.
BREAKING NEWS:-
First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G— Prakash Raj (@prakashraaj) August 20, 2023