దేశానికి సేవ చేయాలనుకున్నాడు.. కానీ, దేశపౌరుల చేతిలోనే తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు. బోర్డర్లో శత్రు దేశ సైనికులను మట్టు బెట్టాలనుకున్నాడు. కానీ, బుల్లెట్లకు బలయ్యాడు. దేశ సేవలో మరణిస్తే.. అమరుడయ్యాడు అనేవాళ్లు.. కానీ, ఇప్పుడు ఆందోళనలో తనువు చాలించాడు. అతనే 18 ఏళ్ల రాకేశ్. అగ్నిపథ్ ఆందోళనల్లో పోలీసుల తూటాలకు బలయ్యాడు రాకేశ్. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. అగ్నిపథ్కు కార్యక్రమానికి వ్యతిరేకంగా యువకులు ఆందోళనకు దిగడంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఆందోళన కారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో రాకేష్ మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు.
అక్క ప్రేరణతో ఆర్మీలోకి వెళ్లాలని..
వరంగల్ జిల్లా దబిర్పల్ గ్రామానికి చెందిన రాకేశ్ ఆర్మీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రాకేశ్ అక్క సంగీత ఒక ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తోంది. ఇక అక్క బాటలోనే తాను కూడా నడవాలి అనుకున్నాడు రాకేశ్. కానీ, తను ఒకటి తలిస్తే దైవం మరోటి తలచింది అన్నట్లు ఆందోళనకారులను అణిచివేసేందుకు పోలీసులు చేసిన కాల్పుల్లో మరణించాడు.
ఇది కూడా చదవండి: Agnipath Programme: ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం! ట్రైన్ తగలబెట్టి ఈ సెల్ఫీలు ఏంటి?
కూతురు లాగానే.. కొడుకు కూడా సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తాడని భావించిన కొడుకు బుల్లెట్కి బలయ్యాడు. అక్క లాగానే ఆర్మీ జవాన్ అయ్యేందుకు సిటీకి వెళ్లిన కొడుకు.. బార్డర్కి వెళ్లకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. చేతికందొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. నా కొడుకు.. నా కొడుకు.. అంటూ ఏడుస్తున్న తీరు ప్రతి ఒకరిని కంటతడి పెట్టిస్తోంది. మరి ఈ విషాదకసర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bharat Bandh: బ్రేకింగ్: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్!