కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. స్టాల్స్, రైళ్లను తగులబెట్టారు. ఇక నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో.. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం సికింద్రబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఇక పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 18వ తేదీన భారత్ బంద్కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. బిహారలోని ఆర్జేడీ అధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్కు మద్దతు తెలిపాయి. ఇక అగ్నిపథ్కు వ్యతిరేకంగా బిహార్, యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.