దేశానికి భద్రత, పౌరులకు రక్షణ కల్పించే యోధులు సైనికులు. కుటుంబాన్ని వీడి దేశ సేవకై సరిహద్దుల్లో పహారా కాస్తుంటారు. సరిగ్గా తిండి దొరకని ప్రాంతంలో నిద్రహారాలు మానేసి దేశం కోసం పాటు పడుతుంటారు.
దేశానికి భద్రత, పౌరులకు రక్షణ కల్పించే యోధులు సైనికులు. కుటుంబాన్ని వీడి దేశ సేవకై సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి పహారా కాస్తుంటారు. సరిగ్గా తిండి దొరకని ప్రాంతంలో నిద్రహారాలు మానేసి దేశం కోసం పాటు పడుతుంటారు. ఇటువంటి సైనికులు, వారి కుటుంబం కోసం నిత్యవసర, గృహోపకరణ వస్తువులు అందించేందుకు ఏర్పాటు చేసిన సెంటర్లు ఆర్మీ క్యాంటీన్లు. ఇందులో అన్ని వస్తువులు మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువకు దొరుకుతుంటాయని అనుకుంటుంటారు. ఇక్కడ రాయితీతో వస్తువులు అమ్ముతుంటారని, ముఖ్యంగా ఆర్మీలో లభించే మద్యం మరెక్కడా దొరకని భావిస్తుంటారు. అయితే నిజంగా వస్తువులు చౌకగా లభిస్తాయా, అందులో వాస్తవమేమిటో చూద్దాం.
దేశ వ్యాప్తంగా దాదాపు 3700 ఆర్మీ క్యాంటీన్లు ఉన్నాయి. ఆర్మీ క్యాంటీన్లో నిత్యావసరాలు, గృహోపకరణాలతో పాటు ఎలక్ట్రానిక్ గూడ్స్, బైక్స్, కార్లు వంటివి కూడా చాలా చౌకగా లభిస్తుంటాయి. కేవలం ఈ సౌలభ్యాన్ని పొందేది జవాన్లు, వారి కుటుంబ సభ్యులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు మాత్రమే. అయితే మనం ఆర్మీ క్యాంటీన్లు అని పిలుస్తాం కానీ. వీటిని క్యాంటిన్ స్టోర్స్ డిపార్ట్ మెంట్స్ (సీఎస్డీ) అని అంటారు. సబ్సిడీలపై వీరు వీటిని పొందవచ్చు. కిరాణా వస్తువులు, కిచెన్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మద్యం, ఆటోమొబైల్స్ మొదలైనవి ఆర్మీ క్యాంటీన్లో అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా విదేశీ ప్రొడక్ట్స్ కూడా క్యాంటీన్లలో లభిస్తుంటాయి. అయితే ఆయా వస్తువులను బట్టి రాయితీ ఉంటుంది.
ప్రతి ఏటా ఆర్మీ క్యాంటీన్ల నుండి 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వస్తువులు అమ్ముడవుతున్నాయి. ఇందుకు ఆర్మీ జవాన్లకు కార్డు ఉంటుంది. ఈ కార్డు ద్వారానే వస్తువులు కొనుగోలు చేస్తారు. కార్డు హోల్డర్తో పాటు బంధువులు, స్నేహితులు వినియోగించుకోవచ్చు. వస్తువులపై రాయితీ అనేది పన్నుపై ఆధారపడి ఉంటుంది. ఆర్మీ క్యాంటీన్లో పన్ను మినహాయింపు కూడా ఉంది. 50 శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది. జీఎస్టీని బట్టి ఆయా వస్తువుల ధరలు నిర్ణయించబడి ఉంటాయి. కొన్ని వస్తువులపై 18 శాతం పన్ను ఉంటే.. కేవలం 9 శాతం మాత్రమే పన్ను విధించబడుతుంది. జీఎస్టీ పన్నులో ప్రభుత్వం 50 శాతం మినహాయింపు ఇస్తుంది. అయితే కొనే వస్తువులపై పరిమితిని నిర్ణయించారు.