నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు నిత్యం తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేస్తుంటారు. ప్రభుత్వ పరిపాలన విషయంలో ప్రతిపక్షం కంటే ఎక్కువ రామ కృష్ణరాజు గారే విమర్శిస్తుంటారు. ఆయనకు ధీటుగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కృష్ణం రాజుపై విరుచుకుపడుతుంటారు. తమ సీఎం అవినీతి కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ గతంలో రామకృష్ణరాజు కోర్టులకు సైతం విన్నవించడం అందరికి తెలిసిందే. మరి సొంత పార్ట నేతలపై ఆయన ఇలా ఎందుకు ఘాటు విమర్శలు చేస్తారనేది సామాన్యులకు అర్థం కాని విషయం.
ఇదిలా ఉండగా.. తాజాగా మే 21న ఎంపీ రఘురామ పుట్టినరోజు సందర్భంగా ఓ యూట్యూబ్ చానెల్ ఆయన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ రోజే ఎందుకు అంటే.. సరిగా ఏడాది క్రితం ఈ రోజుకు ఒక్క రోజు ముందు అనగా.. 2021, మే 20న రఘురామను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై తీవ్రంగా దాడి చేశారని రఘురామ ఆరోపించారు. నాడు జరిగిన సంఘటనను మరోసారి గుర్తు చేసుకున్నారు రఘురామ. అంతేకాక పోలీసులు తాను బాగున్నట్లు.. ఎవరు తనను ఏమి అనలేదని.. తనతో బాగానే వ్యవహరించనట్లు ఓ నివేదిక తయారు చేసి.. దాని మీద తనతో సంతకం చేయించడానికి ప్రయత్నించారని రఘురామ తెలిపాడు. కానీ తాను సంతకం చేయలేదని.. ఆ సమయంలో అక్కడ ఉన్న డీఎస్పీ దిలీప్ కుమార్.. సంతకం పెట్టకపోతే.. రాత్రి జరిగిన దాని కంటే తీవ్రమైన పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని తనను హెచ్చరించారని గుర్తు చేసుకున్నాడు రఘురామ.
ఇది కూడా చదవండి: నర్సాపురం ఉపఎన్నికలో షాకింగ్ ట్విస్ట్! జనసేనలోకి రఘురామ!అంతేకాక తనను కొట్టిన ఐదుగురిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కూడా ఉన్నట్లు రఘురామ తెలిపాడు. తనపై జరిగిన దాడిపై సీబీఐ ఎంక్వైరీ అడిగానని.. కానీ జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నాడు. ఇక తనపై దాడి చేసిన ఐదుగురిలో ఓ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాడని రఘురామ గుర్తు చేసుకున్నాడు. ఆయన ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది అన్నాడు. అంతేకాక కావాలనే తన పుట్టిన రోజునాడే.. రాజద్రోహం కేసు పెట్టి.. తనను హింసించారని రఘురామ చెప్పుకొచ్చాడు. త్వరలోనే వారందరి పేర్లు బయటకు వస్తాయన్నాడు. మరి రఘురామ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.