గతంలో ప్రజలకు ఏ సంక్షేమ, ప్రభుత్వ పథకాలు అందాలంటే క్యూలైన్లలో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ పదిసార్లు తిరగాల్సి వచ్చేది. పథకానికి అర్హులై లబ్ది పొందే సమయానికి పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ..
గతంలో ప్రజలకు ఏ సంక్షేమ, ప్రభుత్వ పథకాలు అందాలంటే క్యూలైన్లలో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ పదిసార్లు తిరగాల్సి వచ్చేది. పథకానికి అర్హులై లబ్ది పొందే సమయానికి పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించిన తర్వాత సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న ఆలోచనతో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. స్వచ్చందంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చిన వారిని వాలంటీర్లుగా నియమించి.. వారి ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలను చేరువ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ వాలంటీర్లవ వల్ల సంక్షేమ పథకాలు.. లబ్దిదారులకు సకాలంలో అందుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.
వాలంటీర్ల వ్యవస్థపై ఎన్ని రూమర్లు, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గలేదు సీఎం జగన్ ప్రభుత్వం. వారికి కేవలం గౌరవ వేతనం మాత్రం అందిస్తోంది. ఇప్పుడు వారి కోసం మరో పరోపకారాన్ని చేపట్టింది జగన్ సర్కార్. వాలంటీర్లకు శుభవార్తను వెల్లడించింది. వీరి సేవను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఒకటో తేదీన గౌరవ వేతనం అందించాలని భావిస్తోంది. గౌరవ వేతనం చెల్లింపుల విషయంలో కొన్ని జిల్లాల్లో జాప్యమవుతుందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ .. వీరి గౌరవ వేతనం మాత్రం ఠంచనుగా ఫస్ట్ తారీఖున అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత పోర్టల్ లో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు సంబంధించిన బిల్లులు అప్ లోడ్ చేశాకే.. మిగతావి పొందుపర్చేలా పోర్టల్లో మార్పులు జరిగాయి. దీంతో మొదటి తారీఖునే వాలంటీర్లు గౌరవ వేతనం పొందనున్నారు.