తెలంగాణలో గవర్నర్కి, సీఎంకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రేంజ్లో విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా ఉంది వ్యవహారం. గవర్నర్గా కాకుండా.. కనీసం మహిళగా కూడా తనను గౌరవించడం లేదని.. సీఎం కేసీఆర్, ఆయన యంత్రాంగం తనతో అమర్యాదగా ప్రవర్తిస్తోందని.. ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు గవర్నర్ బీజేపీకి కొమ్ము కాస్తు.. తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక మీదుగా మరోసారి గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ప్లీనరీ వేదిక మీద మాట్లాడుతూ.. గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా.. రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్ల వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఘటనను కేసీఆర్ గుర్తు చేశారు. పెద్దలు.. పూజ్యులు ఎన్టీఆర్ నిష్కల్మషమైన మనసుతో పార్టీ పెట్టారని.. 200 సీట్లతో అధికారంలోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: జాతిపిత గాంధీజీని ద్వేషించే దేశమా.. భారతదేశం?: సీఎం KCR
అప్పట్లో యువకులుగా తామంతా ఆయన పార్టీలో పనిచేశామని కేసీఆర్ చెప్పారు. కానీ గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కొందరు.. దుర్మార్గంగా ఆయనను సీఎం సీటు నుంచి దించేశారని తెలిపారు. ఆగ్రహించిన తెలుగు ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి మళ్లీ ఎన్టీఆర్ను సింహాసనంపై కూర్చోబెట్టారని అన్నారు. అదెక్కడో రామాయణ గాథల నుంచి చెబుతోంది కాదని.. ఈ హైదరాబాద్ గడ్డపై జరిగిన చరిత్ర అని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత గవర్నర్ అవమానకర రీతిలో ఇక్కడి నుంచి వెళ్లిపోయారని.. తొలగించబడ్డారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Nagababu: పవన్ కంటే జగన్ రేంజ్ ఎక్కువని ఒప్పుకున్న నాగబాబు!
ప్రస్తుతం రాష్ట్రంలో అప్పుడు ఉన్న పరిస్థితులే ఉన్నాయన్నారు కేసీఆర్. మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీలకు ఆమోదం తెలిపి ఫైల్ పంపితే గవర్నర్ వద్ద అలాగే ఉందన్నారు. తమిళనాడు అసెంబ్లీ పంపిన బిల్లు పెండింగ్లో ఉందని.. కేరళ, బెంగాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గవర్నర్ల వ్యవస్థలను దుర్మార్గంగా మార్చేశారని కేసీఆర్ మండిపడ్డారు. అయితే ఈ ప్రసంగంలో ఎక్కడా కూడా కేసీఆర్ తెలంగాణ గవర్నర్ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. గవర్నర్ వ్యవస్థనుద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పెట్రోల్ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి KTR!