మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు, విలీన మండలాల్లో పర్యటిస్తున్నారు. బాధితులను కలిసి.. వారితో మాట్లాడి.. సమస్యలు తెలుసుకుని.. అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. అలానే ప్రభుత్వ తీరుపై, సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో పర్యటనలో రెండో రోజులో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ, సీఎం జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు తన మెడలు తానే దించుకున్నాడని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణం కోసం కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉంటాను.. మీరు నాకు ఓట్లు వేస్తూనే ఉండండి అన్న చందంగా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
వైఎస్ఆర్సీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే కేంద్రం డబ్బులు ఇస్తుందని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి చేయడానికి ఒక వ్యూహంగానీ, ముందు చూపు గానీ లేదని, డబ్బులు ఖర్చు పెట్టడం లేదని అలాంటి ధగాకోరు ప్రభుత్వానికి మేం ఏం చేయలేమని పార్లమెంటులో సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం పూర్తి చేయడం అధికార పార్టీ నేతల వల్ల కాకపోతే ముఖ్యమంత్రితో సహా అందరూ రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తనపైనే వేసుకుంటానని అన్నారు చంద్రబాబు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక, నేరుగా పోలవరం జిల్లానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో అన్నీ పోలవరం ముంపు మండలాలే పెట్టి, జీవితాల్లో వెలుగులు నింపే విధంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. అమరావతి రైతులను వెయ్యి రోజులుగా రోడ్లపై వదిశారని సీఎం జగన్పై ధ్వజమెత్తారు. అలాగే పోలవరం ముంపు ప్రజల్ని ఇప్పుడు బురదలో వేశారని అన్నారు. అధైర్య పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా పోరాడాలి. మీకు అండగా టీడీపీ ఉంటుందని చంద్రబాబు భరోసా కల్పించారు.
‘‘సీఎం జగన్ కోడికత్తి కమల్ హాసన్ లాగా యాక్షన్ మొదలు పెట్టాడు. మళ్లీ పిల్లల్ని ఎత్తుకున్నాడు. ఆడబిడ్డల తలపై చెయ్యి పెట్టి నిమురుతున్నాడు. నేను ట్రాక్టర్ ఎక్కానని, ఆయన కూడా ఎక్కాడు. ఇలా డ్రామాలు ఆడేవాళ్లని నమ్మకూడదు. బాబాయిని చంపిన నాపైకి నెట్టారు. మళ్లీ రేపు ఎవర్నో చంపి నాపైకి నెట్టుతారు. ఇలాంటి సమాజానికి సేవ చేసే ఉద్దేశం లేని వారితో చాలా ప్రమాదరం’’ అంటూ చంద్రబాబు, సీఎం జగన్పై ఘాటు విమర్శలు చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.