ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్నుపై సొంత పార్టీ నేతలే అసహసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వైసీపీ నేతలు వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా చెత్త పన్నుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. ఓ సారి సీఎంను కలుద్దాం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో మంగళవారం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. నాని పర్యటనలో స్థానిక మహిళల తమ సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. చెత్త పన్ను చెల్లింపు భారంగా ఉందని.. అద్దెకు ఉంటున్నవారు చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. వెంటనే స్పందించిన నాని.. మున్సిపల్ అధికారుల్ని పిలిచి చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పినా.. మళ్లీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకు చెత్త పన్ను వసూళ్లలో గుడివాడ రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉందని అధికారి బదులిచ్చారు. నెలకు ఎంత వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశ్నించగా.. సుమారుగా రూ. 16లక్షలు టార్గెట్ ఉంటే.. రూ.14 లక్షలు వసూలవుతోందని చెప్పారు. ఈ మాత్రానికి ప్రజలపై భారం వేయడం సరికాదని.. ఇకపై చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. వెంటనే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి సీఎంను కలుస్తామన్నారు. వెంటనే అక్కడి నుంచే పేర్ని నానికి ఫోన్ చేసి అన్న.. చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఒకసారి సీఎంను కలుద్దాం అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Vangalapudi Anitha: TDP అధికారంలోకి వస్తే కొడాలి నానిపై ప్రతీకారం తీర్చుకుంటాం: వంగలపూడి అనిత ఇది కూడా చదవండి: Kodali Nani: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కొత్త లుక్!