ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శ్రీనివాసులు రెడ్డి సోదరుడు.. సుధాకర్రెడ్డి అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో శుక్రవారం మధ్నాహ్నం కన్నుమూశారు. సుధాకరరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సుధాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో.. ఆయనని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు సుధాకర్ రెడ్డి మృతి చెందారు. సుధాకర్ రెడ్డికి భార్య స్నేహలత, కుమారుడు కిరణ్రెడ్డి, కుమార్తె దీప్తి ఉన్నారు. సుధాకర్రెడ్డి.. […]
ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ నేత విజయ్ సాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన ఇటీవల రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్గా ఎంపికయ్యారు. తాజాగా విజయ్ సాయిరెడ్డి రాజ్యసభను నడపనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. విజయసాయి రెడ్డి కి అరుదైన ఛాన్స్ లభించింది. తాజాగా ఆయన రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో గురువారం తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానంలో ఆశీనులై సభా వ్యవహారాలు నడిపించారు […]
మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు, విలీన మండలాల్లో పర్యటిస్తున్నారు. బాధితులను కలిసి.. వారితో మాట్లాడి.. సమస్యలు తెలుసుకుని.. అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. అలానే ప్రభుత్వ తీరుపై, సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో పర్యటనలో రెండో రోజులో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా […]
ఏపీ మాజీ మంత్రి, టిడిపి నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను కొండాపూర్లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ జరిగిన పదవ తరగతి పరీక్షల్లో వరుసగా.. ప్రశ్నా పత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఈ విషయంపై పలువురు టీచర్లను అరెస్ట్ చేయగా.. వారంతా నారాయణ విద్యాసంస్థలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. నారాయణ అరెస్టు తో ఏపిలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ఈ విషయంపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. అతడి కుటుంబ సభ్యులతో పాటు.. సమాజం కూడా హర్షిస్తుంది. వారి విజయాన్ని తమ విజయంలానే భావిస్తుంది. ఇక ఇలాంటి వారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి.. ఎంపీగా ఎదిగిన తీరు అభినందనీయం. ఎంపీగా గెలవడానికి ముందు వరకు పార్టీ బలోపేతానికి కృషి చేసిన నందిగాం సురేష్ ని ప్రస్తుతం […]
వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి ఐసీయూలోచికిత్సఅందిస్తున్నారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి వైద్యులు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. సోమవారం పార్లమెంట్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్ కళ్లు తిరిగిపడిపోయారు. దీంతో సహచర […]