వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి ఐసీయూలోచికిత్సఅందిస్తున్నారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి వైద్యులు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
సోమవారం పార్లమెంట్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్ కళ్లు తిరిగిపడిపోయారు. దీంతో సహచర ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.