ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ నేత విజయ్ సాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన ఇటీవల రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్గా ఎంపికయ్యారు. తాజాగా విజయ్ సాయిరెడ్డి రాజ్యసభను నడపనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
విజయసాయి రెడ్డి కి అరుదైన ఛాన్స్ లభించింది. తాజాగా ఆయన రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో గురువారం తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానంలో ఆశీనులై సభా వ్యవహారాలు నడిపించారు సాయిరెడ్డి. కాగా, ఏ సందర్భంలో అయినా రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరూ అందుబాటు లేనపుడు ఆ స్థానంలో వైస్ ఛైర్మన్లలో ఎవరో ఒకరు రాజ్యసభను నడిపించాల్సిన బాధ్యత తీసుకుంటారు. ఈ క్రమంలో పలుమార్లు లోక్ సభను ఎంపీ మిథన్ రెడ్డి ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించారు.
ఇటీవల రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ను వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు పునర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ సాయిరెడ్డి అందులో చాన్స్ దక్కింది. ఆయనతో పాటు హనుమంతయ్య, తిరుచి శివ, డాక్టర్ సస్మిత్ పాత్ర, భువనేశ్వర్ కలిత, ఇందు బాలగోస్వామి కు చాన్సు లభించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.