జనగణమన విన్నా, వందేమాతరం విన్నా, కళ్ళ ముందు మూడు రంగుల జెండా ఎగురుతున్నా.. మనందరికీ ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి రక్తంతో తడిసిన ఈ నేల తల్లిని చూస్తే ఎవ్వరికైనా ఈ మట్టిని ముద్దాడాలనిపిస్తుంది. ఈ మట్టి మీద మమకారం అలాంటిది. ముందు దేశం, తర్వాతే దేహం అని ప్రాణాలను లెక్క చేయకుండా మన వీరులు, మహనీయులు కలిసి సాధించిన స్వాత్రంత్ర్య పర్వదినం ఎంతో దూరంలో లేదు. ఈ ఆగస్ట్ 15తో మనం 76వ స్వాతంత్ర్య దినోత్సవంలోకి అడుగుపెడుతున్నాం. ఆగస్ట్ 15 వస్తుంది అంటే స్కూల్లోనూ, కాలేజీల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం కొత్త క్యాంపెయిన్ను స్టార్ట్ చేసింది. 'హర్ ఘర్ తిరంగ'(ప్రతీ ఇంట్లో త్రివర్ణ పతాకం) ఎగరాలి అన్న నినాదంతో సెలబ్రిటీలతో ఒక క్యాంపెయిన్ని అయితే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్కు సంబంధించిన సాంగ్ను కూడా రిలీజ్ చేసింది. ఈ సాంగ్లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, అనుష్క శర్మ వంటి బాలీవుడ్ నటులు, విరాట్ కోహ్లీ, పివి సింధు, మిథాలీ రాజ్ వంటి క్రీడాకారులు, టాలీవుడ్ నుండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దేవిశ్రీప్రసాద్లు దర్శనమిచ్చారు. ఈ వీడియో సాంగ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ డార్లింగ్ తన ఛాతీ ఎక్కుపెట్టి జెండా పట్టుకుని నిలబడతారు. ఈ ఒక్క ఫ్రేమ్లో డార్లింగ్ మాత్రం అదిరిపోయారు. ఒక సోల్జర్లా ఉన్నావన్న అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రభాస్ అన్న గనుక దేశభక్తి బ్యాక్ డ్రాప్లో ఒక మూవీ తీస్తే ఓ రేంజ్లో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మన ప్రభాస్ డార్లింగ్ 'హర్ ఘర్ తిరంగ' క్యాంపెయిన్లో భాగంగా ప్రతీ ఇంట్లో జెండా ఎగురవేయమని పిలుపునివ్వడం అభినందనీయం. మరి డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది మీ ఇళ్ళలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారో కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: ఇంట్లో పూజ గది ఉందని గుడికెళ్ళడం మానేస్తామా? మా దృష్టిలో థియేటరే గుడి: ప్రభాస్ ఇది కూడా చదవండి: Prabhas: రూ. 100 పెట్టి సీతారామం మొదటి టికెట్ కొన్న ప్రభాస్..