బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా విరామం లేకుండా కొనసాగుతున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటని అందరికీ తెలిసిందే. దాదాపు ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని షోలు వచ్చిపోయినా జబర్దస్త్ ఒక్కటే ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తోంది. అయితే.. జబర్దస్త్ లో ఎన్ని మార్పులు జరిగినా యాంకర్ మాత్రం ఎప్పుడూ మారలేదు. ఆఖరికి యాంకర్ అనసూయ షో నుండి వెళ్ళిపోయినా.. యాంకర్ రష్మీనే అటు జబర్దస్త్ ని, ఇటు ఎక్సట్రా జబర్దస్త్ ని మేనేజ్ చేస్తూ వచ్చిందే గానీ, తానెప్పుడూ బ్రేక్ తీసుకోలేదు. కొంతకాలంగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లతో పాటు సుధీర్ వెళ్లిపోయినప్పటి నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా తానే హోస్ట్ చేస్తోంది.
ఈ క్రమంలో జబర్దస్త్ కి సంబంధించి కొత్త ప్రోమో చూసి అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మీ స్థానంలో సౌమ్య రావు అనే సీరియల్ ఆర్టిస్ట్ కనిపించడంతో.. ప్రోమో చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. అనసూయ తర్వాత యాంకర్ రష్మీనే షోని ముందుకు తీసుకెళ్తోంది. అలాంటిది ఒక్కసారిగా ప్రోమోలో కనిపించకపోవడం.. స్వయంగా జడ్జి ఇంద్రజనే యాంకర్ గా సౌమ్య రావును ఇంట్రడ్యూస్ చేయడం.. వచ్చీరాగానే సౌమ్య స్టేజిపై గలగలా మాట్లాడేసరికి రష్మీ ఏమైందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. అందరూ యాంకర్ రష్మీ ఎందుకు కనిపించట్లేదు అనే విషయం పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన సౌమ్య ఎవరబ్బా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇక జబర్దస్త్ కొత్త ప్రోమోలో సౌమ్య రావు యాంకర్ గా కనిపించేసరికి, ఈ షోకి యాంకర్ రష్మీ టాటా చెప్పేసిందా? అని అనుకుంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా రష్మీ.. ఓవైపు సినిమాలు చేస్తూనే షోస్ కంటిన్యూ చేసింది. మరిప్పుడు ఎపిసోడ్ లోనే లేదంటే.. షోని వదిలేసిందేమో అని కూడా భావిస్తున్నారు. మరోవైపు యాంకర్ రష్మీ హీరోయిన్ గా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమా చేసింది. ఆ సినిమా రిలీజ్ కారణంగా ప్రమోషన్స్ లో బిజీ అవ్వడం వల్ల తాను ఒక ఎపిసోడ్ కి దూరమై ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఇకపై సినిమాలలో బిజీ కాబోతుంది కాబట్టి, జబర్దస్త్ కి రాకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి రష్మీ ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ప్రోమోలో అయితే కనిపించింది. సో.. చూడాలి మరి జబర్దస్త్ కి మళ్లీ తిరిగి వస్తుందా లేదా? అనేది.