సినిమాల్లో ప్రభాస్, అనుష్క జంట ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. బుల్లితెర మీద సుధీర్, రష్మీ జంట కూడా అంతే బాగా పాపులర్ అయ్యింది. నిజ జీవితంలో ప్రభాస్, అనుష్క ఒకటైతే చూడాలనుకునే ప్రనుష్క ఫ్యాన్స్ ఎలా అయితే ఉన్నారో.. రష్మీ, సుధీర్ లు కూడా ఒకటవ్వాలని కోరుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఒక షో చేస్తున్నారంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అయితే చాలా రోజుల పాటు దూరమైన వీరిద్దరూ కలిసి ఇప్పుడు మరోసారి షో చేస్తున్నారు. దీంతో మరోసారి వీరి కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బుల్లితెర షోస్లో రీల్ జంటలో ఎక్కువ ఫేమస్ అయిన జంట సుధీర్, రష్మి. వీళ్ళు వేదికపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్కి అంతకు మించిన ఆనందం ఉండదు. వీరిద్దరూ కలిసి చాలా ప్రోగ్రామ్స్కి యంకర్స్గా చేశారు. వీరి కలయికలో అనేక ప్రోగ్రామ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. సుధీర్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోస్ చేస్తూనే సినిమాలో చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలు చేశాడు. అతడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే రష్మి కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యింది. అయితే గత కొంత కాలంగా సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరంగా ఉన్నాడు. దానికి కారణం సినిమాలో చేయడం అని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే సుధీర్, రష్మీ కలిసి ఓ టీవీ షో చేయబోతున్నారని తెలుస్తుంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో వీరు యాంకర్స్గా కనిపించారు. దీంతో వీరిద్దరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బలగం పేరుతో స్పెషల్ ఈవెంట్ను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ షోకు సుధీర్, రష్మి యాంకర్స్గా వ్యవహరిస్తున్నారని ప్రోమోని బట్టి తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత సుధీర్, రష్మి కలిసి చేస్తున్న షో ఇది. ఈ ప్రోమోలో సుధీర్, రష్మీ కెమిస్ట్రీ మరోసారి హైలైట్ అయ్యిందని చెప్పాలి. వీరిద్దరూ మాట్లాడిన కొన్ని డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. “మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారు” అని సుధీర్ అనగా.. అందుకు బదులుగా “నువ్వు వస్తావని ఇన్నాళ్లూ ఎదురుచూశాను” అంటూ రష్మి అంటుంది. దానికి బదులిస్తూ సుధీర్.. “నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లో ఉంటావ్” అంటూ చెప్పడంతో ఒక్కసారిగా స్టేజ్ దద్దరిల్లిపోయింది. అక్కడున్న జనాలు కేకలతో హోరెత్తించారు.
ఎన్నో రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న షో కావడంతో ఆ ప్రోగ్రామ్ మీద ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు వీరి ఫ్యాన్స్. ఈ జోడి ఎప్పటికీ ప్రత్యేకమే అంటున్నారు వారి అభిమానులు. ఈ ప్రోమో చూశాకా మరోసారి వీళ్ళిద్దరి పెళ్లి టాపిక్ మరోసారి తెరమీదకు వచ్చింది. వీళ్ళు తొందరలోనే పెళ్లి చేసుకుంటారని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరు వీరు లవ్ లో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే రష్మీ.. వారి మధ్య ఎప్పుడూ పెళ్లి టాపిక్ రాలేదని, మంచి మిత్రులమని, అన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదని, మా గురించి తప్పుడు ప్రచారం చేయకండి అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. చిన్నప్రోమోతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ జంట ఫుల్ ఎపిసోడ్లో ఇంకెంత సందడి చేస్తారో చూడాలి. ఈ ప్రోమోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.