ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ఒకటి. దాదాపు 14 సీజన్స్ నుండి కొనసాగుతున్న ఈ షో.. ఇండస్ట్రీకి ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ని, బెస్ట్ డాన్సర్స్ ని అందించింది. అలా ఒక్కో సీజన్ దాటుకుంటూ ఇప్పుడు ఏకంగా ఢీ షో.. 15వ సీజన్ లో అడుగు పెడుతోంది. అయితే.. ఈ ఢీ షోని మొదటగా ఎవరైతే ప్రారంభించారో.. ఆయన రాకతోనే ‘ఢీ15’ స్టార్ట్ చేశారు నిర్వాహకులు. ఇంతకీ ఢీ షోని మొదలుపెట్టింది ఎవరో తెలుసు కదా.. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభుదేవా మాస్టర్ ఈ ఢీ ప్రోగ్రాంని ముందు స్టార్ట్ చేశారు. అక్కడినుండి షో సీజన్ల వారీగా ఎదుగుతూ.. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బెస్ట్ డాన్స్ షోలలో ఒకటిగా నిలిచింది ఢీ.
ఇదిలా ఉండగా.. ఢీ షోలో 15వ ఎపిసోడ్ కి సంబంధించి కొత్తగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో చూస్తుంటే.. కొత్త కంటెస్టెంట్స్ తో పాటు ఎంతోమంది కొత్త కొరియోగ్రాఫర్స్ స్టేజ్ పై కనిపిస్తున్నారు. ఇక వచ్చీరాగానే యాంకర్ ప్రదీప్.. ప్రభుదేవా మాస్టర్ ని పెద్దన్నయ్య వచ్చారంటూ పరిచయం చేశాడు. ఎలాగో తెలుగు ప్రేక్షకులకు ప్రభుదేవా పరిచయం అక్కర్లేదు కాబట్టి.. ఆయన మాట్లాడుతూ.. ‘చాలా ఏళ్లయింది ఇక్కడికి వచ్చి. ఇదంతా చూస్తుంటే నా పొలంలో మొలకలు వచ్చాయి’ అని చెప్పుకొచ్చాడు. అలాగే స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ లు కూడా చేయడం మనం ప్రోమోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 11న రాత్రి 7 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతుంది. మరి ఢీ షో, ప్రభుదేవా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.