ఇటీవల కాలంలో వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న సినీ సెలబిట్రీలు కాలం చేస్తున్నారు. ఈ ఏడాదిలో దర్శకుడు విశ్వనాథ్ మొదలుకుని అనేక మంది సీనియర్ నటీనటులు, టెక్నీషియన్లు తుది శ్వాస విడిచారు.
ఇటీవల కాలంలో వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న సినీ సెలబిట్రీలు కాలం చేస్తున్నారు. ఈ ఏడాదిలో దర్శకుడు విశ్వనాథ్ మొదలుకుని అనేక మంది సీనియర్ నటీనటులు, టెక్నీషియన్లు తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు వయో సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా పాత తరం సినీ ప్రముఖులు మరణించిన సంగతి విదితమే. ఇప్పుడు మరో సీనియర్ నటి కన్నుమూశారన్న చేదు వార్త సినీ పరిశ్రమను శోక సంద్రంలో ముంచేసింది. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా సీనియర్ నటీమణి సీమా డియో మృతి చెందారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు.
ఆమె ప్రముఖ చిత్ర దర్శకుడు అభినయ్ డియో తల్లి అన్న విషయం విదితమే. వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా బాంద్రాలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం 8.30-9.00 గంటల మధ్యలో ఆమె చనిపోయినట్లు కుమారుడు వెల్లడించారు. అల్జీమర్ వ్యాధితో బాధపడుతుందని, అన్ని మర్చిపోతూ ఉంటుందని, మూడు సంవత్సరాల నుండి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె కండరాలలో శక్తితో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోయి.. నడవడం కూడా మర్చిపోయిందని చెప్పారు. దీంతో అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయని వెల్లడించారు. సీమా 80కి పైగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించింది. ఆనంద్ మరియు కోరా కాగజ్ మంచి పేరు వచ్చింది. కాగా, ఆమె భర్త, నటుడు రమేష్ డియో కూడా గత ఏడాది మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు. అజింక్యా డియో, అభినయ్ డియో. వీరిద్దరూ కూడా సినీ పరిశ్రమలోనే ఉన్నారు.