ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది ఏవేవో వీడియోలు రికార్డ్ చేసి పబ్లిక్ మీద వదులుతుంటారు. అవి కొందరికి నచ్చచ్చు, కొందరిని నొప్పించవచ్చు. నొప్పిస్తే మాత్రం నెటిజన్స్ ఆగ్రహ జ్వాలలు ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా ఓ యువతి మెట్రో రైలులో అలా చేసే సరికి ఆమె మీద నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకే ఆ యువతి ఏం చేసిందంటే?
అందరూ గూగుల్ లో జాబ్స్ వెతుకుతూ ఉంటారు. గూగుల్ సంస్థలో జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు. ఇందులో విదేశీయులు కూడా ఉంటారు. కానీ జాబ్ కి అప్లై చేయకుండా అయితే ఎవరికీ జాబ్ అనేది రాదు. అప్లై చేయకుండా ఇంటర్వ్యూకే పిలవరు. కానీ ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి మాత్రం జాబ్ కి అప్లై చేయకపోయినా సరే ఇంటర్వ్యూకి పిలిచింది. జాబ్ గ్యారంటీ ఇచ్చింది గూగుల్. ఇంతకే ఆ కుర్రాడు చేసిన పనేంటి అంటే?
ఎవరి పిచ్చి వారికి ఆనందమని ఊరికే అన్నారా..? ఇదిగో ఇలాంటి మహానుభావులను ఉద్దేశించే ఆ మాట అన్నారు. వైరల్ అవ్వాలనే పిచ్చితో యువత పడేపాట్లు ఇతరులకు కంపరం పుట్టిస్తున్నాయి.
ఎవర్ గ్రీన్ క్లాసిక్ 'మాయాబజార్'. బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చినప్పటికీ.. ఈ సినిమా నాటి నుండి నేటికీ సంచలనమే. గొప్ప కథాకథనాలు.. నటీనటుల పెర్ఫార్మన్స్.. వినసొంపైన సంగీతం.. ఆశ్చర్యపరిచే విజువల్స్.. ఆకట్టుకునే ప్రొడక్షన్ డిజైన్.. దర్శకత్వం.. ఇలా ఒక్కటేమిటి అప్పట్లో మాయాబజార్ క్రియేటివిటీకి గొప్ప నిదర్శనం. 'వివాహ భోజనంబు' పాటలో లడ్డూలు గాల్లో ఎగిరి ఘటోత్కచుడి నోట్లోకి వెళ్లడం అప్పట్లో ఓ సెన్సేషన్.
విజయానికి చదువే ముఖ్యం కాదని, గొప్పగా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.. ఓయువకుడు. తన తెలివితేటలను ఉపయోగించి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టి విజయం సాధించి.. అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ ఈ యువకుడు ఏం చేశాడనుకుంటున్నారా! కరెంట్ అక్కర్లేకుండా బావిలోంచి నీళ్లను చక చకా పైకి లాగేస్తున్నాడు.
స్టార్ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ప్రస్తుతం నటిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. రంగస్థలం సినిమాతో నటిగా మారిన అనసూయ.. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తోంది. ఇక అనసూయ నటించిన కొత్త సినిమా 'రంగమార్తాండ' రిలీజ్ కి రెడీ అయ్యింది. తాజాగా రంగమార్తాండ ప్రెస్ మీట్ లో స్టేజ్ పై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
బుల్లితెర ప్రేక్షకులను నాన్ స్టాప్ అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో 'బిగ్ బాస్ జోడి' ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ డ్యాన్స్ రియాలిటీ షో.. ఎట్టకేలకు ఫినాలేకి దగ్గర పడింది. తెలుగులో బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పటిదాకా బిగ్ బాస్ లో జరిగిన ఆరు సీజన్లను ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. కాగా.. అదే బిగ్ బాస్ షోలో సీజన్లవారీగా పాల్గొన్న కంటెస్టెంట్స్.. జోడిగా మారి ఇప్పుడు బిగ్ బాస్ జోడి డ్యాన్స్ షోలో పాల్గొన్నారు.
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ సాధించి ఇండియా మొత్తం గర్వపడేలా చేసింది. 'నాటు నాటు' పాటకు దేశంతో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆడిపాడారు. ముఖ్యంగా నాటు నాటు హుక్ స్టెప్ కి బీభత్సమైన క్రేజ్ పెరిగింది. ఆస్కార్ సాధించిన మొదటి తెలుగు పాటగా నాటు నాటు హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే.. అందరూ నాటు నాటు సాంగ్ చూసి ఎంజాయ్ చేసి.. విజిల్స్ వేశారు. కానీ.. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.
యూట్యూబర్ గా మంచి ఫేమ్ సంపాదించుకొని.. బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టాడు షణ్ముఖ్ జస్వంత్. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఇంకేమైనా ఉందా.. ఏకంగా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్ లు, కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇండియన్ సినిమాలలో కొన్నేళ్లుగా ఎన్నో దారుణమైన మార్పులు చోటు చేసుకున్నాయి. హద్దులు మీరుతున్న రొమాన్స్, బెడ్ రూమ్ సన్నివేశాలు, అక్రమ సంబంధాలు, పేరెంట్స్ మాటలకు విలువ లేనితనం.. ఇలా చాలా విషయాలపై ఎవరు నోరు మెదపడం లేదు. అలాంటి సన్నివేశాలు, కథలు.. సమాజంపై, ముఖ్యంగా యూత్ పై, పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఎవరు బయటికి ప్రశ్నించడం లేదు. సినిమాలలో అంటే.. సెన్సార్ ఉంది. కానీ.. ఓటిటి సినిమాలు, సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో విచ్చలవిడి తనంగా శృంగారం, ఇంటిమేట్ సీన్స్ తీసి చూపిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు శివకృష్ణ ఓ వెబ్ సిరీస్ పై అసహనం వ్యక్తం చేశారు.