బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఆ తర్వాత ప్రేక్షకాదరణ బట్టి.. ఎక్సట్రా జబర్దస్త్ ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. యాంకర్ రష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షో.. జబర్దస్త్ తో పాటు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడీ ఎక్సట్రా జబర్దస్త్ కి నటుడు కృష్ణభగవాన్, సీనియర్ బ్యూటీ ఖుష్బూ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో అంతా స్కిట్స్ తో సందడిగానే సాగింది. కానీ.. మధ్యలో రష్మీ – సుధీర్ ల ప్రస్తావన లేవనెత్తి.. సుధీర్ పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం షోలో లేని సుధీర్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సెలబ్రిటీలైనా, ఎవరైనా వారి అనుకూలతను బట్టి.. ఒక కంపెనీలో, ఒకే చోట ఎక్కువకాలం కంటిన్యూ అవుతుంటారు. అంతకంటే బెటర్ ఆప్షన్ లభిస్తే, బెటర్ ఫ్యూచర్ కోసం ప్రయత్నించేందుకు కంపెనీని వదిలి వెళ్లడం మామూలే. ఇది ఏ రంగంలోనైనా జరిగేదే. అయితే.. జబర్దస్త్, యాంకర్ రష్మీల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న సుధీర్.. ప్రెజెంట్ హీరోగా, నటుడిగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నాడు. అదీగాక సుధీర్ జబర్దస్త్ ని వదిలేసి కూడా దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయినా సరే.. స్కిట్స్ లో రష్మీ టాపిక్ వచ్చినప్పుడల్లా సుధీర్ ని టార్గెట్ చేస్తున్నారు కమెడియన్స్. ఇలా కరెక్ట్ కాదని వాదిస్తున్నారు నెటిజన్స్, సుధీర్ ఫ్యాన్స్.
తాజా ప్రోమోలో రష్మీకి యువరాజు ఉండేవాడని చెబుతూ.. ‘మన రాజ్యంలోనే ఉండేవాడు. పక్క రాజ్యంలో దండయాత్రకి వెళ్ళాడు. మళ్లీ వస్తే మనవాళ్ళు దండయాత్ర చేస్తామన్నారు’ అని కామెంట్స్ చేశారు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ షో నుండి బయటికి వెళ్ళాక కొన్ని నెలలపాటు ట్రోల్స్ చేశారు. ఇప్పుడు సుధీర్ ఎవరిని కదిలించకుండా తన పని తాను చూసుకుంటున్నాడు. సో.. మీరు కూడా ఇకపై సుధీర్ ని ట్రోల్ చేయకుండా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. రష్మీ, సుధీర్ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. ఆ వంకతో ఇంకెంతకాలం ట్రోల్స్ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి షో నుండి వెళ్లిపోయాక కూడా సుధీర్ ని ట్రోల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.