కరోనా కారణంగా మనదేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీపై పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు.. బ్యాంక్లు ఏటీఎం సేవల మీద పలు రకాల చార్జీల పేరుతో బాదుడు మొదలుపెట్టడంతో.. చాలా మంది యూపీఐ పేమెంట్స్కు షిప్ట్ అయ్యారు. కిరాణ షాపు మొదలు.. బంగారు ఆభరణాలు కొనుగోలు వరకు.. ఇలా ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అయితే ఇప్పటివరకైతే.. ఏటీఎం కార్డ్ వినయోగంపై లిమిట్ ఉంది. కానీ తర్వలోనే యూపీఐట్రాన్సాక్షన్స్ పేమెంట్స్కు కూడా లిమిట్ వర్తింపజేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) భావిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఎన్పీసీఐ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ చర్చలు ఫలిస్తే.. యూపీపై పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్పై లిమిట్ వర్తింపచేసే విషయం గురించి డిసెంబర్ 31లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గూగుల్పై ట్రాన్సాక్షన్స్ విషయంలో ఎలాంటి లిమిట్ లేదు. ఫోన్ పే విషయానికి వస్తే.. రోజుకు 10-20 ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు.. లక్ష రూపాయల వరకు మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న యూపీపై పేమెంట్స్ యాప్స్లో ఫోన్ పే, గూగుల్ పే వాటా 80 శాతం వరకు ఉంది.
ట్రాన్సాక్షన్పై లిమిట్ విధిస్తే.. దాని తర్వాత తలెత్తే పరిణామాలపై ఇప్పటికే సమావేశం నిర్వహించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్లో ఎన్పీసీఐ అధికారులతో పాటు.. ఆర్థిక శాఖ అధికారులు, ఆర్బీఐ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే యూపీఐ పేమెంట్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్పై లిమిట్ విధించే దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 31 వరకు దీనికి డెడ్లైన్ విధించారు. డిసెంబర్ చివరి నాటికి.. యూపీఐ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ లిమిట్కు సంబంధించి ఎన్పీసీఐ ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.