తెలంగాణలో పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు వెళ్తోన్న వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ(వై ఎస్ ఆర్ టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీలో పార్టీ పెట్టడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఏపీలో పార్టీ ప్రశ్న పై స్పందించారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పెడతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు షర్మిల స్పందిస్తూ.. ‘ఎవరైనా.. ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు. ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా’ అని తిరుగు ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి : యువతి అరెస్టుపై.. సీఐకి ఫోన్ చేసి నిలదీశిన వైఎస్ షర్మిల!.. వీడియో వైరల్
టీ ఆర్ ఎస్ సీనియర్ నేత, బీసీ నాయకుడు గట్టు రామచందర్ రావు ఇవాళ వైతాపాలో చేరారు. లోటస్పాండ్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి రామచందర్ ని పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : పార్టీతో నాకు సంబంధం లేదన్నారు.. జగన్ తో గొడవపై షర్మిల తొలిసారి ఓపెన్ కామెంట్స్!