ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభమయ్యింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల తీరు చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైనట్లే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దూసుకుపోతుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించే శక్తి యూపీ సొంతం. 403 స్థానాలతో దేశంలోనే ఎక్కువ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం కావడంతో.. కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీని నిర్ణయించే శక్తిగా ఎదిగింది.
ఇది కూడా చదవండి: మరోసారి అసదుద్ధీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఎన్నికల ముందు వరకు కూడా.. దేశవ్యాప్తంగా బీజేపీ హవా తగ్గిందని.. ముఖ్యంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ చర్యల కారణంగా పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయనే వార్తలు వెలుగు చూశాయి. మరోవైపు బీస్పీ మినహా విపక్షాలన్ని కూటమిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. యూపీలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లే అన్న వార్తలు వినిపించాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. అందుకు భిన్నమైన ఫలితాలను వెల్లడించాయి. యూపీలో బీజీపీనే అధికారం చేపడుతుందని తెలిపాయి. విపక్షాలన్ని కలసికట్టుగా ప్రయత్నించినా.. బీజేపీని అడ్డుకోలేకపోయాయి. యూపీలో బీజేపీ గెలుపుకు ప్రధానంగా 10 అంశాలు కలసి వచ్చాయి అంటున్నారు విశ్లేషకులు. అవేంటో చూడండి..
ఇది కూడా చదవండి: రైతులు, మహిళలే లక్ష్యంగా యూపీలో బీజేపీ మేనిఫెస్టో!
1) మోదీ హవా..
కరోనా కట్టడిలో వైఫల్యం, వ్యాక్సిన్ పంపిణీ విషయంలో అడ్డగోలు అనుమతులు, చమురు ధరల పెంపక ఇలా పలు అంశాల్లో మోదీ ఘోరంగా వైఫల్యం అయినప్పటికి.. దేశ భద్రత రక్షణ విషయంలో, చైనాకు చెక్ పెడుతున్న తీరు మోదీని కాపాడుతోంది. అదే బీజేపీకి కలిసి వచ్చింది అంటున్నారు విశ్లేషకులు.
2) యోగి క్రేజ్
ఆకలితో ఉన్న వాడి కడుపు నింపు.. కడుపు గొట్టేవాడిని శిక్షించు.. అక్కాచెల్లళ్ల జోలికి వచ్చిన వాడిని పైకి పంపు ఇదే సూత్రం యోగి ఆదిత్యనాథ్ కి యూపీలో విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చిందని.. అదే బీజేపీని కాపాడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
3) రామ మందిరం నిర్మణం ప్రారంభం అవ్వడం..
బీజేపీ మేనిఫెస్టోలో ప్రధానమైన హామీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం. అది సాకారం కావడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది.
4) మాఫియాకు చెక్ పెట్టిన యోగి..
సమాజ్వాదీ పార్టీ పెంచి పోషించిన గుండా రాజ్కి యోగి చుక్కలు చూపించారు. అల్లరి మూకను, గ్యాంగ్స్టర్లను తుదముట్టించారు. బయట ఉంటే చావు.. జైలుకెళ్తే బతుకు.. అని డైరెక్ట్గానే చెప్పాడు. దాంతో యూపీలో మాఫియా చాలావరకు కంట్రోల్ అయ్యింది.
5) మహిళా ఓట్లు..
తమను పీడించే మృగాళ్లను యోగి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు. తమ భద్రతకు ఆయన హామీ ఇచ్చారు. ఓ మహిళకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. యోగి మీద నమ్మకంతో మహిళలంతా బీజేపీకే పట్టం కట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
6)బీఎస్పీకి మద్దతిచ్చిన బీజేపీ..
ఈ ఎన్నికల్లో బీజేపీని దెబ్బ తీయడానికి ఎస్పీ, మిగతా పార్టీలన్ని కూటమిగా ఏర్పాడాయి. బీఎస్పీని పక్కకు పెట్టాయి. ఎస్పీపై వ్యతిరేకత కారణంగా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. బీజేపీకి మద్దతిచ్చి ఉండవచ్చు అంటున్నారు విశ్లేషకులు.
7)మైనార్టీల మనసు గెలిచిన బీజేపీ..
ఉత్తరప్రదేశ్లోని మొత్తం ఓటర్లలో మైనార్టీల సంఖ్య 25 శాతానికిపైగా ఉంటుంది. కానీ వారంతా అనూహ్యంగా బీజేపీ కే పట్టం కట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మైనార్టీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని అక్కడ 100 స్థానాల్లో బరిలో దిగిన ఎంఐఎం కనీసం ఖాతా తెరవలేదంటేనే.. యూపీలో బీజేపీ పట్ల మైనార్టీలకు ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.
8) యోగిని భర్తీ చేసేవారేవ్వరు లేకపోవడం..
గతంలో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా దారుణంగా ఫెయిల్యూర్ అయ్యాడు. మాయావతి విషయానికి వస్తే.. ఆమెకి ఇప్పుడు ప్రజాదరణ లేదు. కాబట్టి.. యూపీ ఓటర్లకి యోగి తప్ప ఇంకో ఆప్షన్ కూడా లేకుండా పోయింది.
9) కలిసి వచ్చిన హిందుత్వ ఓటు..
ఉత్తరాదిలో కులం కన్నా ముందు మతానికి పెద్ద పీట వేస్తారు. ఈ లెక్కన హిందువులు మెజారిటీ ఓటర్లు కావడం కూడా బీజేపీ కి కలిసి వచ్చింది అంటున్నారు విశ్లేషకులు.
10)జాతీయవాదం..
ప్రస్తుతం మనదేశంలో, జాతీయ భద్రత, జాతీయవాదం కోసం ఓటు వేసే ప్రజల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో ఇందిరాగాంధీని చూసి కాంగ్రెస్ కి కూడా ఈ కారణంగానే ప్రజలు ఓట్లు వేసేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకుంది. ఉత్తరప్రదేశ్లో ఫలితాలతో ఇప్పుడు అది మరోసారి రుజువైంది అంటున్నారు విశ్లేషకులు.
ప్రధానంగా ఈ పది అంశాలే యూపీలో బీజేపీ గెలుపుకు కలిసి వచ్చాయని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.