ఇండియన్ సూపర్ స్టార్గా 7 పదుల వయసులోనూ మనల్ని ఉర్రూతలూగిస్తున్న రజనీకాంత్.. రాజకీయాల్లోకి రావాలని ఆయన, ఆయన ఫ్యాన్స్ కోరుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన వ్యక్తిత్వం. ప్రజలకు సేవ చేసుకోవాలన్న వెలితి ఆయనకి ఇప్పటికీ ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. కానీ ఎందుకో ఆయన వెనకడుగు వేస్తున్నారు. ఆ మధ్య ఒకసారి రాజకీయాల్లోకి వస్తున్నానని, త్వరలోనే పార్టీ పేరు, వివరాలు ప్రకటిస్తానని చెప్పి వెనక్కి తగ్గారు. దీంతో అభిమానుల ఆశల మీద నీళ్ళు చల్లినట్టయ్యింది. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురి బీజేపీ పెద్దలను ఆయన కలిశారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో భేటీ అయ్యారు. దీంతో రజనీకాంత్కి బీజేపీ పార్టీ గవర్నర్ పదవి కట్టబెట్టనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా బీజేపీ ఇళయరాజాకు రాజ్యసభ సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్కు గవర్నర్ పదవి కట్టబెట్టి తమిళనాట చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఒక వ్యూహం ప్రకారం అన్ని రాష్ట్రాలోనూ పాగా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి బీజేపీ, రజనీకాంత్కి గవర్నర్ పదవి కట్టబెట్టబోతుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.