ఎన్నికలు వస్తున్నాయంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు రెడీ అయిపోతారు.
18 ఏళ్లకు ఓటు హక్కే ఉండదు చాలా మందికి. ఆ వయసులో జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు. ఆట, పాటలు వంటివి తప్పితే వేరే ఆలోచన ఉండదు. అలాంటిది రాజకీయమనే మైదానంలో అడుగుపెట్టి.. 21 ఏళ్లకే కార్పొరేటర్ గా గెలిచి.. ఇప్పుడు 23 ఏళ్లకే మేయర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఒక యువతి గురించి తెలుసుకోబోతున్నారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ కన్ను మూశారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు ప్రభావిత రాజకీయ నాయకులను కోల్పోయిన బీజేపీ ఇప్పుడు మూడవ నాయకుడ్ని కోల్పోయింది.
నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలా మోడీ ఇంటి పేరున్న వ్యక్తులు దొంగలు అని రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు పర్యావసానమే ఈరోజు అనర్హత వేటుకు కారణమైంది. అయితే తనపై అనర్హత వేటుకు అసలు కారణం అది కాదని.. అదానీ గురించి ప్రశ్నించినందుకే బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనపై లేనిపోని అబాండాలు వేస్తుందని అన్నారు. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 20 వేల కోట్లు ఎవరివి అని ప్రశ్నించినందుకే తనపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
భారత్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు లెక్కకు అందని విధంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందంటే ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ ఊసే లేకుండా వ్యూహాలు రచిస్తున్నారు.
ఈరోజుల్లో చిరు ఉద్యోగాలు చేసుకునే వారికే సొంత ఇళ్ళు ఉంటున్నాయి. ఇక రాజకీయ నేతల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకూ ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్ళు ఉంటాయి. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇప్పటి వరకూ ఒక సొంత ఇల్లు లేదని చెబుతున్నారు.
భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా ఎంతోపేరు గడించారు ప్రతిభా పాటిల్. అలాంటి ప్రతిభా పాటిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే..!
సాధారణంగా రాజకీయ నాయకులపై పదుల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు అవుతుంటాయి. ప్రజల కోసం పోరాడే సమయంలో ధర్నాలు, ర్యాలీలు, బంద్ లు ఇలాంటి సందర్భంలో రాజకీయ నాయకులపై ఎక్కువగా కేసులు నమోదు అవుతుంటాయి. ఇక మరికొందరిపై అత్యంత కఠినమైన కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. తాజాగా ఓ ఎంపీ మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జిల్లా కోర్టు తీర్పు ఇస్తూ.. సదరు MPతో పాటుగా మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. కొత్త కొత్త పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉంటాయి. ఆ పథకాల వల్ల పేదరికాన్ని దేశం, రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి అన్నదే ఆ ప్రభుత్వాల ధ్యేయం. అందులో భాగంగానే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద దేశంలో ఉన్న 81.35 కోట్ల మంది పేదలకు సంవత్సరం […]
రుణమాఫీ అనే పదం రైతులకు ఎంతో సంతోషాన్నిచ్చే పదం. రుణమాఫీ అనేది రైతులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా అస్త్రమే. రైతులు గెలవాలన్నా, రాజకీయ నాయకులు గెలవాలన్నా రాజకీయ డిక్షనరీలో రుణమాఫీ అన్న పదం ఉండాల్సిందే. అధికారంలోకి రావడం కోసం ఉపయోగించే హామీ అస్త్రాల్లో ఈ రుణమాఫీ ఒకటి. రుణమాఫీ చేస్తామని చెప్తే రైతుల ఓట్లు పడతాయన్న నమ్మకం రాజకీయ నాయకులది. ఈ క్రమంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే […]