ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ 6న నెల్లూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.40 గంటలకు సంగం చేరుకుని.. అక్కడ జగన్ మిత్రుడైన మేకపాటి గౌతమ్ పేరు మీద నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభిస్తారు. అనంతరం జగన్ బహిరంగ సభలో ప్రసంగించి నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మేకపాటి గౌతమ్ జగన్ కి చిన్ననాటి నుంచి మిత్రుడన్న విషయం తెలిసిందే. మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే జగన్ కి ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జ్ఞాపకార్ధం నెల్లూరులో సంగం బ్యారేజ్ పేరుని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ గా ప్రకటించారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం సమయంలో అసెంబ్లీలో సంగం బ్యారేజ్ కి మిత్రుడి పేరు పెడుతూ కీలక ప్రకటన చేశారు. దీంతో గౌతమ్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని జగన్ అన్నారు. ఆ విధంగా మిత్రుడి మీద ప్రేమని చాటుకున్న జగన్.. ఇప్పుడు దాన్ని నిజం చేసేందుకు సిద్ధమయ్యారు. మిత్రుడి పేరు మీద కట్టిన బ్యారేజ్ ని ప్రారంభించి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుని చరిత్ర పుటల్లోకి ఎక్కించనున్నారు. మరి మిత్రుడి పట్ల ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్న జగన్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.