భార్యా భర్తల బంధం కూలేందుకు మనస్పర్థలే ప్రధాన కారణమౌతున్నాయి. ఇద్దరి మధ్య ఓ విషయం చర్చకు వస్తే.. దాన్ని డిబేట్గా సాగదీసుకుని.. తమదంటే తమ నిర్ణయమే కరెక్ట్ అని గొడవల వరకు తెచ్చుకుంటున్నారు.
భార్యా భర్తల బంధం కూలేందుకు మనస్పర్థలే ప్రధాన కారణమౌతున్నాయి. ఇద్దరి మధ్య ఓ విషయం చర్చకు వస్తే.. దాన్ని డిబేట్గా సాగదీసుకుని.. తమదంటే తమ నిర్ణయమే కరెక్ట్ అని గొడవల వరకు తెచ్చుకుంటున్నారు. ఇక అత్త, కోడళ్ల మధ్య సఖ్యత లేకపోవడం కూడా బంధాన్ని బీటలు వారేలా చేస్తుంది. కుమారుడు తన మాట వినాలని అత్త, మామల కోరికతో పాటు వేరే కాపురం పెట్టాలన్న భార్య పోరు గొడవలకు దారి తీస్తున్నాయి. దీని వల్ల జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకుని.. కనీసం ఐదారేళ్లు కూడా కాపురాలు చేయడం లేదు. అప్పటికే చేతిలో ఒక బిడ్డ.. మరో సంకలో మరో బిడ్డ ఉంటున్నాడు. పిల్లల కోసమేనా కొందరు కాంప్రమైజ్ అవుతుంటే.. మరికొంత మంది ఈ మ్యారేజ్ లైఫ్, ఆ భర్త వద్దంటూ వదిలేసి వెళ్లిపోతున్నారు.
అయితే భర్త ఎప్పుడైనా తన వద్దకు రాపోతాడా అని భార్య.. తన మాట వినకపోతుందా అని భర్త ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూ గడిపేస్తున్నారు. విడాకులు తీసుకోకుండా దూరంగా ఉంటున్నారు. వారి మధ్య ఇగో అడ్డొచ్చి మాటలు దూరమై.. ఆ తర్వాత ఆవేశాలకు లోనౌతున్నారు. ఇలాంటి కుటుంబ కలహాలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. నెల్లూరులోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో దారుణం జరిగింది. కొడుకు చావుకు కోడలే కారణమని భావించి అత్తమామాలు, మరిది కలిసి కోడలు, ఆమె తండ్రి, అమ్మమ్మను చంపేశారు. విస్తుపోయే ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండబిట్రగుంటకు చెందిన రైల్వే ఉద్యోగి మందాటి మధుసూదన్కు, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన కృష్ణయ్య కుమార్తె మౌనికకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మన్విత్ అనే కుమారుడు ఉన్నాడు.
అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ మనస్పర్థలు ఏర్పడంతో విడివిడిగా ఉంటున్నారు. మౌనిక.. తన బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. వీరి కుమారుడు మన్విత్ తన అమ్మమ్మ శాంతమ్మ ఇంట్లో ఉంచి.. తాను బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. అయితే ఇటీవల మధుసూదన్ గుండె పోటుతో చనిపోయాడు. ఈ నేపథ్యంలో కొండబిట్రగుంటకు మౌనిక తన తండ్రి, అమ్మమ్మలతో వచ్చింది. తన కొడుకు చావుకు కోడలే కారణమని భావించడంతో పాటు.. ఆమెకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని భావించిన అత్తమామలు, మరిది కలిసి ఆమెపై కక్ష పెంచుకున్నారు. పాత గొడవలు కూడా కలిసి ఆవేశంతో రగిలిపోయారు. అయితే ఆదివారం ఉదయం ఈ ముగ్గురు రక్తపు మడుగుల్లో శవాలై కనిపించారు. మౌనిక తల్లి ఫోన్లు చేయగా.. ఎవ్వరూ తీయకపోవడంతో పాటు బాబు మౌనిక అత్తమామలు కనిపించడం లేదన్న సమాచారంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు గ్రామానికి చేరుకుని చూడగా.. ఈ ముగ్గురు హత్యకు గురై కనిపించారు. మౌనిక మామ(మధుసూదన్ తండ్రి) మాల్యాద్రి, మరిది చంద్రమౌళి, అత్త ధనమ్మ కనిపించకపోవడంతో వారే ఈ హత్యలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. హత్యకు కారణాలు..చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకపోవడం, ఎలాంటి అరుపులు వినిపించకపోవడం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు.మరోవైపు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా మౌనిక అత్త ధనమ్మను గ్రామంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యల అనంతరం నిందితులు ఎక్కడికి పారిపోయారు, మౌనిక కుమారుడు మన్విత్ ఎక్కడ ఉన్నాడని ఆరా తీస్తున్నారు. ముగ్గుర్ని కోల్పోవడంతో మౌనిక తల్లి వేదన వర్ణనాతీతం.