రాష్ట్రంలో పేద ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. పిల్లలు చదువుకునే దగ్గర నుంచి వివాహం చేసుకునే వరకూ అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతల్లో కదలికలు మొదలయ్యాయి. పార్టీ తరపున టికెట్ కేటాయింపులపై దృష్టి సారిస్తారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించేదుకు ముందుకు వస్తారు. ఓటర్లను ఆకర్షితులను గావించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
సాకే భారతి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. కూలి పనులు చేసుకునే స్థాయి నుంచి పీహెచ్డీ స్థాయికి ఎదిగిన గొప్ప మహిళ. అలాంటి ఆమెకు జగన్ సర్కార్ అండగా నిలిచింది.
ప్రస్తుతం ఏపీలో ఆహా క్యాంటీన్లు హాట్ టాపిక్ గా మారింది. తక్కువ ధరకు పేద ప్రజలకు పట్టణాల్లో క్యాంటీన్ ద్వారా రుచికరమైన భోజనం అందుతుంది. అయితే దీని వల్ల ఎవరికి లాభం?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి చేతికి కట్టుతో కనిపించారు. దీంతో అసలు ఆమెకు ఏమైంది? ఆ గాయం ఎలా అయిందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక జట్టే ఐపీఎల్లో ఉండేది. అదే సన్రైజర్స్ హైదరాబాద్. ఈ ఫ్రాంచైజీకి తెలుగు ఫ్యాన్స్ భారీగా మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే ఇకపై ఐపీఎల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమ్ ఉండాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన పక్కా ప్లాన్ చేస్తున్నారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాక ప్రజల్లో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే సీఎం కుటుంబ సభ్యుల గురించి, ఆస్తిపాస్తులు, వ్యాపారాల గురించి కూడా తెలుసుకోవాలనే కోరిక సామన్య ప్రజానీకంలో ఉండటంలో తప్పు లేదు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ కంపెనీలు తాజాగా దీనిపై నివేదిక విడుదల చేశాయి. దేశంలో ఎవరు అత్యంత సంపన్న ముఖ్యమంత్రో ప్రకటించాయి.