ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రి వర్గంలో పాతవారు 11 మంది, కొత్త వారు 14 మంది ఉన్నారు. మరోసారి పదవి దక్కలేదని.. పలువురు మాజీ మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీరిలో బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్ను కొనసాగించడంతో ఆయన మరింత ఆగ్రహానికి గురయ్యారు. రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: బాలినేనికి మద్దతుగా ప్రకాశంలో మొదలైన రాజీనామాల పర్వం!
బాలినేని రాజకీయ ప్రస్థానం ఇది..
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలినేని 6 సార్లు పోటీ చేసి.. ఐదు సార్లు విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో ఆయన మంత్రిగా ఉన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద అభిమానంతో.. మంత్రి పదవిని వదిలేసి.. జగన్ వెంట నడిచారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. జగన్ నమ్మకాన్ని గెలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి బంధువుగానే కాక.. జిల్లాలో అధికారపార్టీకి కేంద్ర బిందువుగా మారారు. ఇంతటి చరిత్ర ఉన్న బాలినేనికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కలేదు. దీనిపై బాలినేనితో పాటు.. ఆయన అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: జగన్ మంత్రి పదవి ఇస్తానన్నా.. వద్దన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి! కారణం?
అవినీతి ఆరోపనలే బాలినేనికి అడ్డంకి అయ్యాయా?బాలినేనిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అండ చూసుకుని.. అనుచరులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాలినేని అండ చూసుకుని.. ఆయనకు కేటాయించిన విద్యుత్తు, రెవెన్యూ శాఖల్లో పనులు చేయాలని అనుచరులు.. అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అనుచరులతో పాటు బాలినేని కుటుంబ సభ్యులు, బంధువులు కూడా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేనికి మరోసారి అవకాశం ఇస్తే.. అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావించే.. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: దురదృష్టం అంటే ఆ YCP ఎమ్మెల్యేదే.. చివరి నిమిషంలో మంత్రి పదవి చేజారింది!