బాలీవుడ్లో హీరోయిన్ తాప్సి సత్తా చాటుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. ప్రస్తుతం తాప్సీ రష్మిక రాకెట్ మూవీలో నటిస్తోంది. ఇందులో అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఓ పాన్ ఇండియా కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. అది ఓ సైన్స్ ఫిక్షన్ కథని, దానికి ‘ఏలియన్’ అనే పేరుని అనుకుంటున్నట్టు సమాచారం. భరత్ నీలకంఠన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ‘‘గ్రహాంతర వాసుల నేపథ్యంగా సాగే సైన్స్ ఫిక్షన్ కథ ఇది. ఎక్కడా హాలీవుడ్ ఏలియన్ సినిమాల ఛాయలు ఇందులో కనిపించవు.కొత్తగా ఉంటుంది. భారతదేశంలో ఏలియన్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రం ఉండనుంది’’అని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
విజువల్ ఎఫెక్ట్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ భాషల్లో ‘ఏలియన్’ తెరకెక్కనుంది. తాప్సి త్వరలోనే ‘శెభాష్ మిథు’ చిత్రీకరణలో పాల్గొననుంది. ఆమె నటించిన ‘హాసిన్ దిల్రూబా’ జులైలో ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇంకా ‘రష్మీ రాకెట్’, ‘లూప్ లపేటా’ తదితర చిత్రాలు తాప్సి చేతిలో ఉన్నాయి.
హీరోయిన్ అన్నాక అటు గ్లామర్, ఇటు నటన రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని., తాప్సీ ఇందుకు భిన్నంగా ముందుకు వెళుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాప్సీకి ఇవి వినబడుతున్నాయో లేదో మరి.