రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల స్టార్ట్ చేసిన వందేభారత్ రైలు ఛార్జీలు సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. దేశంలో క్రమంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. కొన్ని మార్గాల్లో ఛార్జీలు తగ్గేఛాన్స్ ఉంది.
ఈ మధ్యకాలంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అనేక మార్గాల్లో ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా మన ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం నడుస్తున్న చాలా మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లో సీట్లు పూర్తిగా భర్తీ అవట్లేవని సమాచారం. అయితే ఇలాంటి సమయంలో రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. కొన్ని మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఛార్జీలను తగ్గించే దిశగా సమీక్షిస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ తక్కువ రద్దీ ఉన్నచోట టికెట్ ధరలు తగ్గించేందుకు సన్నాహాలు చేస్తుంది. అక్కడక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లో సీట్లు పూర్తిగా నిండటం లేదు. అందుకుగాను రైల్వేశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైల్వేశాఖ నివేదికల ప్రకారం..ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్పూర్, నాగ్పూర్-బిలాస్పూర్ ఇంకా మరికొన్ని రూట్లలో వందే భారత్ ట్రైన్స్ ఛార్జీలను తగ్గించే దిశగా సమీక్షిస్తున్నారు. ఈ మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులు తక్కువగా ఉండి, సీట్లు చాలావరకు ఖాళీగా ఉంటున్నాయి. ఇండోర్-భోపాల్ మార్గంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లేందుకు సుమారుగా మూడు గంటల సమయం పడుతుంది. అయితే జూన్ నెలలో 29 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని. తిరిగి వస్తున్నపుడు ఇదే రైలులో కేవలం 21 శాతం సీట్లు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ రైలు ధర రూ. 950 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్కార్ ధర రూ. 1525.
అదేవిధంగా నాగ్పూర్-బిలాస్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో 55 శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నట్లు తెలిపింది. భోపాల్-జబల్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించుటకు సుమారుగా 4.5 గంటల సమయం పడుతుంది. ఈ ట్రైన్ లో కూడా అన్ని సీట్లు భర్తీ కావడంలేదు. నాగ్పూర్-బిలాస్పూర్ ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఎగ్జిక్యూటివ్ రూ. 2,045, చైర్ కార్కు రూ. 1,075. భోపాల్ నుండి జబల్పూర్కి ఏసీ చైర్కార్కు రూ. 1,055, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ టికెట్ ధర రూ. 1,880. ఈ మార్గంలో తిరిగి వచ్చేటప్పుడు ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. ఏసీ చైర్ కార్కు రూ. 955, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి రూ.1790 అవుతుంది.