దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి రైల్వే. అయితే గతంలో రైల్వేపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. గూడ్సు కన్నా ఘోరంగా వెళుతూ, సమయానికి రాకపోకగా, గమ్యస్థానానికి చూడా వేళకు చేరుకోదు. క్రాసింగ్ ఉంటే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది.
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల స్టార్ట్ చేసిన వందేభారత్ రైలు ఛార్జీలు సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. దేశంలో క్రమంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. కొన్ని మార్గాల్లో ఛార్జీలు తగ్గేఛాన్స్ ఉంది.
వేగవంతమైన ట్రైన్లను నడపాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ రైల్వే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దానిలో భాగంగా పలు మార్గాల్లో ట్రైన్లను ప్రారంభించింది. ఇప్పుడు మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు 80 వందే భారత్ ట్రైన్లకు ఆర్డర్ ఇచ్చింది.