మన దగ్గర అప్పుడప్పుడు కొన్ని వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు కొందరు డప్పుల శబ్దం వినగానే ఊగిపోతుంటారు. పునకం వచ్చిందని.. దేవుడు ఆవహించాడని అంటుంటారు. అయితే మానసిక విశ్లేషకులు మాత్రం ఇదోక మానసిక రుగ్మత అంటారు. ఇదిగో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుడిలో పూజారిగా పని చేస్తున్న ఓ వ్యక్తి.. 6 నెలలుగా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అది ఏంటంటే ఆడవాళ్లు.. ఆఖరికి చిన్న బాలికలు తాకినా సరే వెంటనే స్పృహ తప్పి పడిపోతున్నాడు. ఈ వింత సంఘటన వివరాలు..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడో పూజారిని ఎవరైనా మహిళలు, బాలికలు తాకితే వెంటనే కళ్లు తిరిగిపడిపోతున్నాడు. తాను హనుమాన్ భక్తుడనని అందుకే ఇలా జరుగుతుందని చెబుతున్నాడు. గత ఆరు నెలల నుంచి పూజారి ప్రవర్తనలో ఇలాంటి మార్పు వచ్చిందని భక్తులు అంటున్నారు. దీంతో విసుగు చెందిన భక్తులు అతనిని భోపాల్లోని జేపీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆర్కే బైరాగి పూజారిని పరీక్షించారు. అన్ని టెస్ట్లు చేశారు. రిపోర్టులన్ని నార్మల్గానే వచ్చాయి. ఇక ఆస్పత్రిలో కూడా నర్స్ ముట్టుకున్న వెంటనే స్పృహ కోల్పోయాడు పూజారి.
ఇది కూడా చదవండి: ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అవుతాను: గాలి జనార్దన్రెడ్డి
దాంతో డాక్టర్ బాగా ఆలోచించి.. అతనికో పరీక్ష పెట్టారు. మిమ్మల్ని పరీక్షించేందుకు మహిళా నర్స్ వస్తుందని పూజారికి చెప్పి.. మగ వ్యక్తిని పంపించారు. కానీ ఆ విషయం తెలియని పూజారి అతను తాకగానే కళ్లు తిరిగి పడిపోయాడు. పూజారి స్పృహలోకి వచ్చాక డాక్టర్ జరిగినదంతా చెప్పాడు. అంతేకాక అదొక ప్రత్యేకమైన పరిస్థితి అని తెలియజేశారు. ఈ సమస్యను కన్వర్షన్ డిజార్డర్ అంటారని డాక్టర్ తెలిపాడు. దీనివల్లే అతను వింతగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం ఆ పూజారికి చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజులుగా కౌన్సెలింగ్ ఇస్తున్నామని, దాంతో పాటు వైద్యం కూడా అందిస్తున్నామని కూడా డాక్టర్ బైరాగి తెలిపారు. ఈ ట్రీట్మెంట్తో పూజారి త్వరలోనే ఈ పరిస్థితి నుంచి బయటపడతారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Video: పవిత్ర నదిలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు పెట్టిన భర్త.. చితకబాదేసిన జనం!
అయితే చాలామంది ఈ మానసిక రుగ్మతతో బాధపడుతుంటారని, తనలో ఏదో శక్తి వచ్చిందని భావించడం, అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని డాక్టర్ బైరాగి చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ కొన్ని సూచనలు చేశారు. ఒక వ్యక్తి ఏదైనా పనిని సాధారణం కంటే ఎక్కువగా చేస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. సాధారణంగా పది, 15 నిమిషాల కంటే ఎక్కువసేపు పూజలు చేయడం, గుడిలో గంటలు గంటలు గడపడం, ఎక్కువసేపు శుభ్రం చేసుకోవడం, ఒంటరిగా కూర్చుని మాట్లాడుకోవడం వంటివి చేస్తుంటే వారిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: TS High Court: సీఎం కేసీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ..!