జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం స్టూడెంట్ నం.1 సినిమా చూశారా. దానిలో ఎన్టీఆర్ ఉద్దేశపూర్వకంగా ఏం నేరం చేయని తన తండ్రిని కేసులో ఇరికిస్తే.. ఆయన తరఫున వాదించి గెలు గెలిచి.. తండ్రిని విడుదల చేయిస్తాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జైలులో ఉండి చదువుకుంటాడు. ఇప్పుడు మీర చదవబోయే కథనం కూడా ఈ కోవకు చెందినదే. అన్యాయంగా తన తండ్రిని చంపిన హంతకులకు తగిన శిక్ష పడేలా చేయడం కోసం.. అతడి కుమార్తె లాయర్ అయ్యి.. 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి.. తండ్రిని చంపిన నేరస్తులకు శిక్ష పడేలా చేసి.. కేసు గెలిచింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. లాయర్ అవ్వాలని తనకు లేకపోయినా.. తండ్రి బలవంతం మీద న్యాయవిద్య చదవడానికి అంగీకరించిన ఆ యువతి.. చివరకు తండ్రి హత్య కేసును వాదించాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం ఆమె కథనం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
బంగ్లాదేశ్కు చెందని తాహెర్ అహ్మద్ అనే వ్యక్తి అక్కడి యూనివర్శిటిలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించేవాడు. ఆయన కుమార్తె షెగుఫ్తా తబసుమ్. కుమార్తెను లాయర్గా చూడాలనేది అహ్మద్ కోరిక. కానీ షెగుఫ్తాకి మాత్రం లా చదవాలంటే ఆసక్తి లేదు. కానీ తండ్రి కోరిక మేరకు అంగీకరించింది. ఆ నిమిషం షెగుఫ్తాకు తెలియదు.. తండ్రి కోరిక మేరకు లాయర్ అయిన తాను.. భవిష్యత్తులో తండ్రి హత్య కేసునే వాదించాల్సి వస్తుందని. ఇక షెగుఫ్తా లా కాలేజీలో జాయిన్ అన్ని కొన్ని రోజులకే అనగా 2006, ఫిబ్రవరి 1న తండ్రి అహ్మద్ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రెండు రోజుల తర్వాత అహ్మద్ శవం ఓ మ్యాన్ హోల్లో లభ్యం అయ్యింది.
ఇది కూడా చదవండి: గోనె సంచిలో ప్రముఖ నటి మృతదేహం! షాక్ లో ఇండస్ట్రీ!
అహ్మద్ మృతితో షెగుఫ్తా చదువుకి కొద్ది రోజులు బ్రేక్ పడింది. ఆ సమయంలో అహ్మద్ మృతికి కారణమైన వ్యక్తులు బెయిల్ మీద బయటకు వచ్చి దర్జాగా తిరగడం షెగుఫ్తా జీర్ణించుకోలేకపోయింది. అప్పటి వరకు లా అంటే పెద్దగా ఆసక్తి చూపని షెగుఫ్తా.. తండ్రిని చంపిన వారికి తగిన శిక్ష పడేలా చేశాలని.. అది కూడా తన ద్వారా జరగాలని నిర్ణయించుకుని.. పట్టుదలతో లా పూర్తి చేసింది.
లా పూర్తి చేసిన షెగుఫ్తా.. ఢాకా బార్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకుని.. తండ్రి కేసును టేకప్ చేసింది. ఎంతో శ్రమించి.. ఆధారాలు సేకరించి.. నేరస్తులకు శిక్ష పడేలా చూసింది. ఆ సమయంలో ఎన్ని కష్టాలు, బెదిరింపులు వచ్చిన భయపడకుండా తట్టుకుని నిలబడింది. షెగుఫ్తా పట్టుదల ముందు అన్యాయం తలవంచింది. కేసు విచారణ సమయంలో నేరస్తులు తప్పించుకోవాలని చూసినా.. వారికి ఆ అవకాశం దొరకనివ్వలేదు షెగుఫ్తా. చివరకు 2008లో అహ్మద్ కేసులో సిటీ కోర్టు నలుగురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ఫోర్ కాదు..సిక్స్ కాదు..అయినా ఒక బంతికి 7 పరుగులు
దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. 2013లో హైకోర్టు నలుగురిలో ఇద్దరు నిందితులకు మరణ శిక్ష విధించి.. మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ.. నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగుతూ వస్తుంది. చివరకు సుప్రీంకోర్టులో కూడా.. విజయం షెగుఫ్తానే వరించింది.
అహ్మద్ కొలిగ్సే నేరస్తులు..
ఈ కేసులో అహ్మద్ ప్రొఫెసర్గా పని చేసిన యూనివర్శిటీలో చదువుకున్న వారు, ఆయనతో కలిసి పని చేసిన వారే.. దోషులు. వీరంతా డబ్బు కోసం, ఉన్నత పదవుల కోసం అహ్మద్ను హత్య చేసినట్లు సుప్రీం కోర్టు విచారణలో వెల్లడయ్యింది. ఈ క్రమంలో గతంలో హైకోర్టు విధించిన తీర్పును సమర్ధిస్తూ.. దోషుల్లో ఇద్దరికి మరణ దండన, మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ.. సుప్రీకోర్టు తీర్పు వెల్లడించింది. 16 ఏళ్ల పాటు పట్టువదలకుండా పోరాడి.. కేసు గెలిచి తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా చేసింది షెగుఫ్తా. ఆమె చేసిన పోరాటాన్ని నెటిజనులు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. షెగుఫ్తా సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వైరల్గా మారిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి డ్యాన్స్ వీడియో!