కొంతమంది చాలా రిచ్ పీపుల్లాగా వ్యవహరిస్తుంటారు. ఖరీదైన కార్లలో తిరుగుతుంటారు. కారు రెంట్ పే చేసేందుకు వెనకాడుతారు. డబ్బున్న వ్యక్తుల్లా నటిస్తారు. కానీ చెల్లించే దగ్గర మాత్రం వెనకడుగు వేస్తారు. ఖరీదైన లగ్జరీ హోటల్స్కి వెళుతుంటారు. బిల్లు పే చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంటారు.
కొంతమంది చాలా రిచ్ పీపుల్లాగా వ్యవహరిస్తుంటారు. ఖరీదైన కార్లలో తిరుగుతుంటారు. కారు రెంట్ పే చేసేందుకు వెనకాడుతారు. డబ్బున్న వ్యక్తుల్లా నటిస్తారు. కానీ చెల్లించే దగ్గర మాత్రం వెనకడుగు వేస్తారు. ఖరీదైన లగ్జరీ హోటల్స్కి వెళుతుంటారు. బిల్లు పే చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంటారు. చివరకు పోలీసుల జోక్యం వరకు వెళుతుంది వ్యవహారం. హోటల్ యాజమాన్యాలు ఆ వ్యక్తులను బ్లాక్ లిస్ట్ చేసేంత సీన్ జరుగుతుంది. కానీ దీనిక విరుద్దంగా తమ దేశ టూరిస్టులు పే చేయలేని బిల్లును ఓ హోటల్ లో ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటలీకి చెందిన కొంతమంది టూరిస్టులు అల్బేనియా వెళ్లారు. ఓ రెస్టారెంట్కి వెళ్లి సుమారుగా ఏడు వేల బిల్లు వరకు తిన్నారు. తిన్న దానికి బిల్లు కట్టకుండా పారిపోయారు. తర్వాత కొన్ని రోజులకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అల్బేనియా వెళ్లారు. ఈ క్రమంలో వారికి ఇటలీ సిటీజన్స్ రెస్టారెంట్ బిల్లు పే చేయలేదన్న విషయం తెలిసింది. వెంటనే ఆ బిల్లును చెల్లించవలసిందిగా అధికారులకు సూచించారు. ‘ఆ మూర్ఖుల తరపున బిల్లు చెల్లించండి’ అని ఇటలీ రాయబారికి తెలిపారు.
ఆ పర్యటనలో ఇటలీ ప్రధానితోపాటు ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా కూడా ఉన్నారు. దేశ ప్రజల తీరుపై స్పందిస్తూ..‘ ఇటలీ దేశ పర్యాటకులు ఎగవేసిన బిల్లును చెల్లంచాలని ప్రధాని సూచించారు. ఇటలీ రాయబారి ఆ పనిని పూర్తి చేశారు. కొందరు నిజాయితీ లేని వ్యక్తుల ప్రవర్తన కారణంగా మంచి వ్యక్తులు ఉన్న దేశం పేరు చెడగొట్టలేరు’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇటలీ నుంచి సుమారు ఐదు లక్షల మంది పర్యాటకులు అల్బేనియాను సందర్శన కోసం వస్తుంటారు. ఇటలీలో టూరిజం ఖరీదు కాబట్టి ఇటలీ ప్రజలు అల్బేనియాకు టూర్లు వెళుతుంటారు. అల్బేనియాలో టూరిస్ట్ ప్యాకేజీలు తక్కువ ధరకే ఉండడంతో అందరు అల్బేనియాకు వెళ్లడానికి మొగ్గు చూపుతారు.