మంచి పనులు చేసిన వారికి, వాలంటీర్స్గా వ్యవహరించిన వారికి వారు నిర్వహించిన పనుల తీరును బట్టి వారికి కూడా బహుమతులు ఇస్తారు. సమాజం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడినవారికి కూడా అవార్డులు ప్రదానం చేస్తారు.
స్కూల్ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు అందరి సమక్షంలో ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ మంచి మాటలు కూడా చెబుతారు. అప్పుడు పిల్లలు చాలా అనుభూతి పొందుతారు. అలాగే మంచి పనులు చేసిన వారికి, వాలంటీర్స్గా వ్యవహరించిన వారికి వారు నిర్వహించిన పనుల తీరును బట్టి వారికి కూడా బహుమతులు ఇస్తారు. సమాజం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడినవారికి కూడా అవార్డులు ప్రదానం చేస్తారు. అలాగే ఇక్కడ మన భారతీయ బాలలలు అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్ -2023కు ఐదుగురు ఎంపికయ్యారు. వారి గురించి పూర్తి వివారాలను తెలుసుకుందాం..
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న బాలలకు ఇచ్చే అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్ -2023కు ఈ సారి మొత్తం 17 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో ఐదుగురు భారతీయ బాలలు ఎంపికయ్యారు. ఐమా దీక్షిత్(మేరఠ్), మాన్య హర్ష (బెంగళూరు), నిర్వాణ్ సోమానీ (దిల్లీ), మన్నత్ కౌర్ (దిల్లీ), కర్ణవ్ రస్తోగి (ముంబాయి) వీరిని పురస్కారం వరించింది. అమెరికా స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్ ఫర్ నేచర్’ ఏటా ఈ అవార్డ్ ప్రదానం చేస్తారు. ఈ పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన ఐహా దీక్షిత్ నాలుగేళ్ల వయసు నుండే మొక్కలు నాటడం మొదలుపెట్టింది. కొందరు వాలంటీర్లతో కలిసి మేరఠ్ నగరంలో దాదాపు 20,000 మొక్కలు నాటింది. మొక్కల నిధిని ఏర్పాటు చేసి ఫ్రీగా మొక్కలను పంచిపెడుతుంది.
రెండవ స్థానం పొందిన మాన్య హర్ష తన బుక్స్, బ్లాగ్, యూట్యూబ్ ఛానల్ ‘ది లిటిల్ ఎన్విరాన్మెంటలిస్ట్’ తో ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ పెంచుతోంది. దాదాపు 3,500 మొక్కలను నాటి, 3000 విత్తన బంతులను పంచింది. ఇక నిర్వాణ్ సోమానీ ఇతరులు తొడిగి వదిలేసిన డెనిమ్ జీన్స్ దుస్తులను పోగు చేసి మార్పులు చేసి పేదవారికి ఇస్తున్నాడు. అలా 6000 జీన్స్ను పంచారు. 800 జీన్స్లను దుప్పట్లుగా చేసి పంచాడు. తద్వారా దుస్తులు చెల్లాచెదరుగా పడి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాడు. మూడో ప్లేస్ పొందిన మనత్ కౌర్ కాలుష్య రహితంగా వ్యర్థ జలాల శుద్ధిని, తాగునీటి సరఫరా ప్రొగ్రామ్స్ చేపట్టింది. ఇకపోతే 13 సంవత్సరాల కర్ణవ్ రస్తోగీ ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడం ద్వారా వాతావరణ మార్పుల నిరోధానికి పాటు పడుతున్నందున విజేతగా నిలిచాడు.