మన సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ భూమ్మీ మీద మానవ మనుగడకు పెళ్లి బంధం కూడా ఓ కారణం అవుతుంది. అయితే మారుతున్న కాలంతో పాటు.. సమాజంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లి కాకుండా బిడ్డలని కంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక వివాహం తర్వాత.. భాగస్వామిని మోసం చేస్తున్నవారు కూడా ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో స్త్రీ, పురుషులు సమానంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న నేరాల్లో అత్యధికం వివాహేతర సంబంధం కారణంగా జరుగుతున్నవే. వీటి గురించి కాసేపు పక్కకు పెడితే ఇక పెళ్లిల్లకు సంబంధించి అనేక సంప్రదాయాలు ఆచరణలో ఉంటాయి. ఇక మనదేశంలో అయితే మరి ఎక్కువ. అయితే కొన్ని ఆచారాలు చూస్తే.. ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కూడా జరుగుతుందా.. అని అనుమానం వస్తుంది. ఈ కోవకు చెందిన ఓ వింత రూల్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
పెళ్లి అంటే జీవితంలో.. ఒక్కసారి ఒక్కరితో మాత్రమే ముడిపడే బంధం. అయితే మారుతున్న కాలంతో పాటు ఆ ఆలోచన మారింది. భాగస్వామి నుంచి విడిపోవడం, మృతి చెందడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే.. మరోసారి వివాహం చేసుకుంటున్నారు. అదేం నేరం కాదు. కానీ కొందరు మాత్రం ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడుతూ మోసం చేస్తారు. మనతో పాటు చాలా దేశాల్లో దీన్ని నేరంగా పరిగణిస్తారు. అయితే కొన్ని జాతులు, ప్రాంతాలు, దేశాల్లో మాత్రం బహుభార్యత్వం సర్వ సాధారణం.
నచ్చితే ఒక్కరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవచ్చు. కానీ తప్పకుండా రెండు పెళ్లిల్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైలుకు పంపిస్తాం అని అంటే.. ఇదెక్కడి విడ్డూరం అనిపిస్తుంది కదా. కానీ ఈ వింత రూల్ ఆఫ్రికాలో అమల్లో ఉంది. ఎరిత్రియా దేశంలోని ప్రతి పురుషుడు.. తన ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా రెండు వివాహాలు చేసుకోవాల్సింది. స్త్రీలు కూడా దీన్ని అంగికరించాలి. లేదంటే జైల్లో వేస్తారు.
ఈ వెరైటీ రూల్ పెట్టడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఎరిత్రియా దేశంలో పురుషుల కన్నా స్త్రీల జనాభా అధికంగా ఉంది. వారి నిష్పత్తిని సమం చేసేందుకు.. ఈ రూల్ తీసుకువచ్చింది అక్కడి ప్రభుత్వం. అంతేకాక ఎవరైనా ఒకే భార్యను కలిగి ఉంటే.. అతడిని దోషిగా పరిగణించి జైల్లో వేస్తారు అధికారులు. స్త్రీ, పురుషులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రూల్ కచ్చితంగా ఫాలో కావాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.