కొన్ని వివాహాలు జరిగిన తర్వాత వివాదాలు చోటుచేసుకుంటుంటే ఇ ఘటనలో మాత్రం పెళ్లికి ముందే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వరుడు చేసిన ఆ పనితో అందరు షాక్ కు గురయ్యారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఓ మధురమైన ఘట్టం. ఎన్నో ఆశలతో, కలలతో వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు యువతీ యువకులు. కానీ ఈ మధ్య కాలంలో జరిగే వివాహాలు పలు రకాల వివాదాలతో అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. దీనికి గల కారణాలు అమ్మాయి నచ్చకపోవడం, అబ్బాయి నచ్చకపోవడమో, వారి అభిరుచులు కలవక పోవడమో లేక జాతకాలు కుదరలేదనో ఏవో వంకలు చూపి వివాహాలను రద్దు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వరుడు ఓ యువతితో నిశ్చితార్థం జరుపుకుని, ఆ తరువాత ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కు గురిచేసింది. అతడు చేసిన ఆ పనికి ఆ యువతి కుటుంబసభ్యులు నివ్వెరపోయారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? ఆ యువతి తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమ, పెళ్లి పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. మోసాలకు గురై వారి జీవితాలను కష్టాలపాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడుకి ఓ యువతితో వివాహం నిశ్చయించారు. దీనిలో భాగంగా ఎంగేజ్మెంట్ ఘనంగా జరుపుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచే ఆ యువకుడు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. దీంతో షాక్ అవ్వడం యువతీ కుటుంబసభ్యుల వంతు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది మార్చి 1న ఓ యువతితో నగరంలోని ఓ కంట్రీ క్లబ్ లో నిశ్చితార్థం చేసుకున్నాడు రోహిత్ డెవిడ్ పాల్ అనే యువకుడు. ఎంగేజ్మెంట్ కోసం యువతి కుటుంబసభ్యులు 10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా చేశారు. ఆ తరవాత జూలైలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. కాగా పెళ్లి తేదీ దగ్గర పడుతుండటంతో యువతి కుటుంబసభ్యులు పెళ్లి ప్రస్థావన తీసుకురాగ రోహిత్ దాటవేస్తూ వచ్చాడు. రోహిత్ తల్లి అనిత డాక్టర్ గా పనిచేస్తుంది.
ఆమె కూడా పెళ్లిపట్ల అశ్రధ్ద చూపుతూ ఏవేవో కారణాలు చెబుతూ గతేడాది జూలైలో జరగాల్సిన వివాహాన్ని సంవత్సర కాలం వాయిదా వేస్తూ ఈ ఏడాది జూలై వరకు తీసుకువచ్చారు. పెళ్లి దాటవేతపై వరుడు రోహిత్ ను యువతి కుటుంబసభ్యులు నిలదీయగా తన వక్రబుద్దిని బయటపెట్టాడు. రూ. 2 కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని రోహిత్ తెగేసి చెప్పాడు. దీంతో షాక్ కు గురైన యువతి కుటుంబసభ్యులు పెళ్లికి ముందే వరకట్నం పేరుతో వేధిస్తుండడంతో యువతి తల్లిదండ్రులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎంగేజ్మెంట్ కోసం రూ. 10 లక్షలు ఖర్చు చేశామని వాటిని తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లికి ముందే వరకట్నం పేరుతో వేధిస్తున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.